ETV Bharat / state

సీఎం కేసీఆర్​ రాసిన సందేశంతోనే..​ ఆత్మీయ సమ్మేళనాలు: కేటీఆర్​

author img

By

Published : Apr 2, 2023, 3:25 PM IST

KTR Directions On BRS Spiritual Gatherings Tele Conference: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నబీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలను సీఎం కేసీఆర్​ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్​ తెలిపారు. పార్టీ శ్రేణులతో జరిపిన టెలికాన్ఫరెన్స్​లో వారికి దిశానిర్దేశం చేశారు. మళ్లీ పార్టీని అధికారంలోకి నిలపడానికి.. ఇప్పటి నుంచే శ్రమించి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

KTR
KTR

KTR Directions On BRS Spiritual Gatherings Tele Conference: సీఎం కేసీఆర్​ రాసిన సందేశంతోనే బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభం కావాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులతో​ టెలీ కాన్ఫరెన్స్​ ఆదివారం​ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆత్మీయ సమ్మేళనాల గురించి దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్​ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై కమిటి వేస్తున్నామని ఆయన చెప్పారు. మధుసూదనా చారి ఆధ్వర్యంలో పది మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కమిటీకి పార్టీలోని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా అంతా సామరస్యంగా ఈ కమిటీ సూచనలు పాటించి.. ముందుకు సాగిపోవాలని సూచించారు.

KTR BRS Spiritual Gatherings Tele Conference: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు.. కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కేటీఆర్​ వివరించారు. అలాగే సోషల్​ మీడియా కమిటీలను బలోపేతం చేసుకునే విధంగా.. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో దిశానిర్దేశం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది ఎన్నిక దృష్ట్యా ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన వాటిపై స్పందించాలని ప్రజా ప్రతినిధులకు సూచనలు చేశారు. అందుకే బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు వరకు చేసుకోవచ్చుని వెల్లడించారు.

100 సీట్లే టార్గెట్​: ఈ ఆత్మీయ సమ్మేళనాలు అన్నింటిలో సీఎం కేసీఆర్​ రాసి ఇచ్చిన సందేశంతోనే ప్రారంభం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలోని ఉన్న బీఆర్​ఎస్​ నేతలు అందరూ.. క్యాడర్​తో సంబంధం లేకుండా ఈ సమ్మేళనాల్లో పాల్గొని.. పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేయాలన్నారు. ఈసారి 100 సీట్లుని టార్గెట్​గా పెట్టుకుని ఎందుకు ఆ దిశగా అడుగులు ఎలా వేయాలో ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు.. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లవలసిన బాధ్యత ప్రతి బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తల పైనా ఉందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసుకోవాలని మంత్రి కేటీఆర్​ సూచించారు.

ఇవీ చదవండి:

KTR Directions On BRS Spiritual Gatherings Tele Conference: సీఎం కేసీఆర్​ రాసిన సందేశంతోనే బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభం కావాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులతో​ టెలీ కాన్ఫరెన్స్​ ఆదివారం​ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆత్మీయ సమ్మేళనాల గురించి దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్​ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై కమిటి వేస్తున్నామని ఆయన చెప్పారు. మధుసూదనా చారి ఆధ్వర్యంలో పది మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కమిటీకి పార్టీలోని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా అంతా సామరస్యంగా ఈ కమిటీ సూచనలు పాటించి.. ముందుకు సాగిపోవాలని సూచించారు.

KTR BRS Spiritual Gatherings Tele Conference: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు.. కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కేటీఆర్​ వివరించారు. అలాగే సోషల్​ మీడియా కమిటీలను బలోపేతం చేసుకునే విధంగా.. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో దిశానిర్దేశం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది ఎన్నిక దృష్ట్యా ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన వాటిపై స్పందించాలని ప్రజా ప్రతినిధులకు సూచనలు చేశారు. అందుకే బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు వరకు చేసుకోవచ్చుని వెల్లడించారు.

100 సీట్లే టార్గెట్​: ఈ ఆత్మీయ సమ్మేళనాలు అన్నింటిలో సీఎం కేసీఆర్​ రాసి ఇచ్చిన సందేశంతోనే ప్రారంభం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలోని ఉన్న బీఆర్​ఎస్​ నేతలు అందరూ.. క్యాడర్​తో సంబంధం లేకుండా ఈ సమ్మేళనాల్లో పాల్గొని.. పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేయాలన్నారు. ఈసారి 100 సీట్లుని టార్గెట్​గా పెట్టుకుని ఎందుకు ఆ దిశగా అడుగులు ఎలా వేయాలో ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు.. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లవలసిన బాధ్యత ప్రతి బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తల పైనా ఉందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసుకోవాలని మంత్రి కేటీఆర్​ సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.