ETV Bharat / state

రాష్ట్ర హెచ్​ఆర్సీని ఆశ్రయించిన మధ్యమానేరు నిర్వాసితులు

author img

By

Published : Sep 25, 2020, 4:37 PM IST

తమకు రావాల్సిన పరిహారం తగ్గించి, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.

Telangana Humana Rights Commission
రాష్ట్ర హెచ్​ఆర్సీని ఆశ్రయించిన మధ్యమానేరు నిర్వాసితులు

రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన నిర్వాసితులు తమకు రావాల్సిన పరిహారం తగ్గించి... భూ సేకరణ చట్టాలను ఉల్లఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్​ను కోరారు.

తమకు కేటాయించిన స్థలాలు నివాస యోగ్యంగా లేవని... అందులో బండరాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని వాపోయారు. తమకు రావాల్సిన పరిహారం ఇప్పించి... చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని నిర్వాసితులు కమిషన్​ను కోరారు. ఈ ఘటనపై స్పందించిన హెచ్​ఆర్సీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన నిర్వాసితులు తమకు రావాల్సిన పరిహారం తగ్గించి... భూ సేకరణ చట్టాలను ఉల్లఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్​ను కోరారు.

తమకు కేటాయించిన స్థలాలు నివాస యోగ్యంగా లేవని... అందులో బండరాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని వాపోయారు. తమకు రావాల్సిన పరిహారం ఇప్పించి... చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని నిర్వాసితులు కమిషన్​ను కోరారు. ఈ ఘటనపై స్పందించిన హెచ్​ఆర్సీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.