మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్జడ్సీ కార్యదర్శి గణేష్ రైతు ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ... ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుల కోసం పది సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయటం, సహజ వనరులను ప్రైవేటీకరించడం, విద్యా, వైద్యాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనకరం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ.. మభ్యపెడుతున్నారని విమర్శించారు.


ఇదీ చదవండి: 'దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా'