ETV Bharat / state

మానవత్వమే చిన్నబోయింది... చివరికి ఆత్మహత్యాయత్నం చేసింది!

author img

By

Published : Mar 30, 2020, 8:00 PM IST

అతడు మానవత్వంతో ఆలోచించాడు. సమాజం ఛీకొట్టింది! అతను సహృదయతను చాటాడు. సమాజం చీదరించుకుంది! ఓ బాంబు పేలుళ్ల ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారిని చేరదీసిన మానవతావాది కన్నీటి గాథ ఇది. ఆ వేధింపులు తాళలేక చివరికి అతడే ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన ఇది.

Man sucide attempt in Hyderabad
మానవత్వం చేరదీస్తే.. అడ్డంకిగా మారిన మతం
మానవత్వం చేరదీస్తే.. అడ్డంకిగా మారిన మతం

మానవత్వంతో ఓ చిన్నారిని చేరదీస్తే... మతం అడ్డంకిగా మారింది. సమాజంలో తోటివారి నుంచి చీదరింపులు, దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను పెంచుకున్న కూతురు కోసం ఆత్మహత్యకు యత్నించాడు. గోకుల్​చాట్ బండార్​లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మూడేళ్ల బాలిక తల్లిదండ్రులను కోల్పోయింది. చుడీబజార్​కు చెందిన పాపాలాల్ 2007లో బాలిక సానియా ఫాతిమాను అక్కున చేర్చుకొని సొంత కూతురిలా పెంచుకున్నాడు.

13 సంవత్సరాలుగా ప్రేమగా చూసుకున్నాడు. ఆ పాపతోపాటు తనకు ముగ్గురు పిల్లలున్నారు. ఓ మతానికి చెందిన అమ్మాయిని పెంచుకోవడం పట్ల స్థానికులతో తరుచు గొడవలు జరిగేవి. ఈ విషయంపై స్థానిక షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్​లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. పెయింటర్​గా పని చేస్తూ... ఆడపిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. స్థానికంగా ఉండే కొంతమంది వ్యక్తులు తరుచూ గొడవపడుతూ... తనపైనే అక్రమ కేసులు పెట్టగా.. పాపాలాల్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

ఇరువర్గాల గొడవల కారణంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం పోలీసులు పాపాలాల్​ను విచారించేందుకు అతని ఇంటికి చేరుకోగా... మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న పాపాలాల్​ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపాలాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి: ఆదిలాబాద్​ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత

మానవత్వం చేరదీస్తే.. అడ్డంకిగా మారిన మతం

మానవత్వంతో ఓ చిన్నారిని చేరదీస్తే... మతం అడ్డంకిగా మారింది. సమాజంలో తోటివారి నుంచి చీదరింపులు, దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను పెంచుకున్న కూతురు కోసం ఆత్మహత్యకు యత్నించాడు. గోకుల్​చాట్ బండార్​లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మూడేళ్ల బాలిక తల్లిదండ్రులను కోల్పోయింది. చుడీబజార్​కు చెందిన పాపాలాల్ 2007లో బాలిక సానియా ఫాతిమాను అక్కున చేర్చుకొని సొంత కూతురిలా పెంచుకున్నాడు.

13 సంవత్సరాలుగా ప్రేమగా చూసుకున్నాడు. ఆ పాపతోపాటు తనకు ముగ్గురు పిల్లలున్నారు. ఓ మతానికి చెందిన అమ్మాయిని పెంచుకోవడం పట్ల స్థానికులతో తరుచు గొడవలు జరిగేవి. ఈ విషయంపై స్థానిక షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్​లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. పెయింటర్​గా పని చేస్తూ... ఆడపిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. స్థానికంగా ఉండే కొంతమంది వ్యక్తులు తరుచూ గొడవపడుతూ... తనపైనే అక్రమ కేసులు పెట్టగా.. పాపాలాల్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

ఇరువర్గాల గొడవల కారణంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం పోలీసులు పాపాలాల్​ను విచారించేందుకు అతని ఇంటికి చేరుకోగా... మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న పాపాలాల్​ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపాలాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి: ఆదిలాబాద్​ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.