MAN CLIMBS UP ELECTRIC TOWER:హైదరాబాద్ అంబర్పేటలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా నివసించే మోహన్బాబు హై టెన్షన్ టవర్ ఎక్కాడు. స్థానికులు ఎంతలా బతిమాలినా కిందకు దిగలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అతడిని కిందకు దింపేందుకు నానా తంటాలు పడ్డారు. నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కొత్త తోపుడు బండిని ఇప్పిస్తామని చెప్పడంతో అతను టవర్ దిగాడు. దీంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: DGP rejoined in duties: రెండు వారాల తర్వాత విధుల్లో చేరిన డీజీపీ