ప్రసంగిస్తున్న గవర్నర్ సౌందర రాజన్ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో టాలీవుడ్ తారలు తళుక్కున మెరిశారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2019 ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ హాజరయ్యారు. సౌత్లో మొదటి సారి జరుగుతున్న దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని గవర్నర్ తెలిపారు. టాలీవుడ్లో అత్యుత్తమ సినిమాలు చేసి, ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు అవార్డ్స్ అందించండం వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ అవార్డ్స్లో పద్మశ్రీ, డా. మంచు మోహన్ బాబుకు జీవితసాఫల్యత పురస్కారం రాగా, 'భరత్ అనే నేను' చిత్రానికి గాను నటుడు మహేశ్ బాబు బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ చేతుల మీదుగా మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు ఫంక్షన్లో పలువురు టాలీవుడ్ హీరోయిన్స్ విభిన్న వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు.
అవార్డుతో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వేడుకలో పాయల్ రాజ్పుత్ పురస్కారం అందుకుంటున్న దర్శకుడు సుకుమార్ ఇదీ చూడండి: 'కావాలనే ఆంజనేయులును హత్య చేశారు'