హైదరాబాద్ లక్డికాపుల్ వద్ద లారీ కింద పడి ఓ వాహనదారుడు మృతి చెందాడు. లక్డికాపుల్ నీరంకారి భవన్ మలుపు వద్ద డివైడర్ ఢీకొట్టి లోడ్తో వెళ్తున్న లారీ వెనుక టైర్ల కింద పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందడం వల్ల సైఫాబాద్ పోలీసులు లారీ డ్రైవర్ ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు ఆఫీసర్స్ మెస్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై మాసబ్ ట్యాంక్ నుంచి కోఠి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : రోడ్డుపైనే కాదు.. కాన్వాస్పైనా గీస్తూ అవగాహన