ETV Bharat / state

LOCKDOWN: సాయంత్రం 6 తరువాత మొదలైన లాక్​డౌన్​..

author img

By

Published : Jun 10, 2021, 6:54 PM IST

Updated : Jun 10, 2021, 7:58 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 కాగానే పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

lockdown
రాష్ట్రంలో పటిష్ఠంగా అమలవుతోన్న లాక్​డౌన్​..

రాష్ట్రంలో లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలవుతోంది. సాయంత్రం 6 కాగానే పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంకా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ్టి నుంచి లాక్​డౌన్​ విరామ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించిన విషయం అందరికి తెలిసిందే. వాహనదారులు ఇళ్లకు వెళ్లడానికి మరో గంట అనగా... 6గంటల వరకు ప్రభుత్వం ప్రజలకు గడువిచ్చింది. సాయంత్రం 6 దాటిన అనంతరం లాక్​డౌన్​ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

పోలీసులు ఎక్కడికక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు చేసి లాక్​డౌన్​ను అమలు చేస్తున్నారు. జంట నగరాల్లో పోలీసులు వాహనదారులను త్వరగా ఇళ్లకు వెళ్లాలని పంపిస్తున్నారు. మే 12వ తేదీ నుంచి పది రోజుల పాటు ఉదయం 6గంటల 10 గంటల వరకు అమలైన లాక్​డౌన్​ సడలింపులు... అనంతరం 9రోజుల పాటు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు అమలయ్యాయి. తాజాగా ఈ రోజు నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలింపులు ఇచ్చారు.

జంట నగరాల్లో సాయంత్రం 6దాటిన తర్వాత కూడా రోడ్లపై రద్దీ ఎక్కువగానే ఉంది. వాహనదారులంతా ఒకేసారి ఇళ్లకు బయలుదేరడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఆ ట్రాఫిక్​ను క్లియర్​ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దీనికి తోడు అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాహనదారులతో పాటు పోలీసులు ఇబ్బందులకు గురయ్యారు.

ఇదీ చదవండి: uttam kumar: రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ పంపుల వద్ద నిరసనలు

రాష్ట్రంలో లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలవుతోంది. సాయంత్రం 6 కాగానే పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంకా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ్టి నుంచి లాక్​డౌన్​ విరామ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించిన విషయం అందరికి తెలిసిందే. వాహనదారులు ఇళ్లకు వెళ్లడానికి మరో గంట అనగా... 6గంటల వరకు ప్రభుత్వం ప్రజలకు గడువిచ్చింది. సాయంత్రం 6 దాటిన అనంతరం లాక్​డౌన్​ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

పోలీసులు ఎక్కడికక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు చేసి లాక్​డౌన్​ను అమలు చేస్తున్నారు. జంట నగరాల్లో పోలీసులు వాహనదారులను త్వరగా ఇళ్లకు వెళ్లాలని పంపిస్తున్నారు. మే 12వ తేదీ నుంచి పది రోజుల పాటు ఉదయం 6గంటల 10 గంటల వరకు అమలైన లాక్​డౌన్​ సడలింపులు... అనంతరం 9రోజుల పాటు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు అమలయ్యాయి. తాజాగా ఈ రోజు నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలింపులు ఇచ్చారు.

జంట నగరాల్లో సాయంత్రం 6దాటిన తర్వాత కూడా రోడ్లపై రద్దీ ఎక్కువగానే ఉంది. వాహనదారులంతా ఒకేసారి ఇళ్లకు బయలుదేరడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఆ ట్రాఫిక్​ను క్లియర్​ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దీనికి తోడు అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాహనదారులతో పాటు పోలీసులు ఇబ్బందులకు గురయ్యారు.

ఇదీ చదవండి: uttam kumar: రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ పంపుల వద్ద నిరసనలు

Last Updated : Jun 10, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.