ETV Bharat / state

'ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు... అందుకే కరోనా విజృంభణ'

author img

By

Published : Jul 21, 2020, 9:01 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఇస్టారాజ్యంగా ఏర్పాటవుతున్నాయని, వాటి వల్లే కరోనా విస్తరిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌ దుకాణాలే దర్శనం ఇస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

'ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు... అందుకే కరోనా విజృంభణ'
'ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు... అందుకే కరోనా విజృంభణ'

ఎలాంటి భౌతిక దూరాన్ని పాటించకుండా మద్యం కోసం జనం ఎగబడుతుండటం వల్ల కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి మరణించే ప్రతి వ్యక్తికీ సీఎం కేసీఆరే బాధ్యుడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదాయ వనరుల సమీకరణపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ... ప్రజల ప్రాణాలపై లేదని మండిపడ్డారు. పేద ప్రజలంటే లెక్క లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆరేళ్లుగా వైద్యులను నియమించలేదన్నారు.

'వారికి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదట'

ఒప్పంద వైద్యులు తనను కలిశారని... జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని వారు వాపోయినట్లు భట్టి తెలిపారు. నీటిపారుదల శాఖ పూర్తిగా భ్రష్టు పట్టిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రిటైరై ఏడేళ్లు గడిచినా మురళీధర్ రావునే ఇఎన్‌సీగా కొనసాగుతున్నారన్నారు. ఆయన ద్వారానే నిధులు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.

'సీఎస్​నూ బాధ్యుడిగా చేస్తాం'

బిజినెస్ రూల్స్ పాటించకపోవడానికి సీఎస్ సోమేశ్ కుమార్‌ను కూడా బాధ్యుడిని చేస్తామని భట్టి హెచ్చరించారు. నీటిపారుదల శాఖలో జరుగుతున్న అన్యాయంపై న్యాయస్థానం తలుపు తడతామని స్పష్టం చేశారు.

'ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు... అందుకే కరోనా విజృంభణ'

ఇవీ చూడండి : కరోనా నివారణకు ఎంత ఖర్చు చేశారు: బండి సంజయ్

ఎలాంటి భౌతిక దూరాన్ని పాటించకుండా మద్యం కోసం జనం ఎగబడుతుండటం వల్ల కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి మరణించే ప్రతి వ్యక్తికీ సీఎం కేసీఆరే బాధ్యుడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదాయ వనరుల సమీకరణపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ... ప్రజల ప్రాణాలపై లేదని మండిపడ్డారు. పేద ప్రజలంటే లెక్క లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆరేళ్లుగా వైద్యులను నియమించలేదన్నారు.

'వారికి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదట'

ఒప్పంద వైద్యులు తనను కలిశారని... జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని వారు వాపోయినట్లు భట్టి తెలిపారు. నీటిపారుదల శాఖ పూర్తిగా భ్రష్టు పట్టిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రిటైరై ఏడేళ్లు గడిచినా మురళీధర్ రావునే ఇఎన్‌సీగా కొనసాగుతున్నారన్నారు. ఆయన ద్వారానే నిధులు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.

'సీఎస్​నూ బాధ్యుడిగా చేస్తాం'

బిజినెస్ రూల్స్ పాటించకపోవడానికి సీఎస్ సోమేశ్ కుమార్‌ను కూడా బాధ్యుడిని చేస్తామని భట్టి హెచ్చరించారు. నీటిపారుదల శాఖలో జరుగుతున్న అన్యాయంపై న్యాయస్థానం తలుపు తడతామని స్పష్టం చేశారు.

'ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు... అందుకే కరోనా విజృంభణ'

ఇవీ చూడండి : కరోనా నివారణకు ఎంత ఖర్చు చేశారు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.