హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో 14 మంది బాల కార్మికులకు చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు, దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, ఛత్రినాక పోలీసులు సంయుక్తంగా విముక్తి కల్పించారు. పటేల్నగర్, రాఘవేంద్ర నగర్లలోని గాజుల పరిశ్రమలో గుట్టుచప్పుడు కాకుండా బలకార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఈ అంశంపై ఓ వ్యక్తి చైల్డ్ హెల్ప్లైన్కు ఫోన్ చేయగా రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు పిల్లలను విడిపించారు.
బిహార్కు చెందిన తరుణ్, సంతోష్లను నిర్వాహకులుగా గుర్తించారు. బిహార్ నుంచి నెలకు రూ. ఐదు వేల చొప్పున ఇస్తామని బాలల తల్లిదండ్రులను మభ్యపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. ఈ దాడుల్లో హైదరాబాద్ చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు, దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, ఛత్రినాక పోలీసులు పాల్గొన్నారు. నిర్వాహకులు ఇద్దరిపై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి : వరంగల్ సీపీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు