ETV Bharat / state

కేసు మాఫీ చేస్తానని మోసం చేసిన న్యాయవాది అరెస్టు - kukatpally crime

డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసు మాఫీ చేస్తానని ఓ ఐటీ ఉద్యోగిని మోసం చేసిన న్యాయవాదిని కూకట్​పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చందానగర్​కు చెందిన వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అనంతరం మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుణ్ని కటాకటాల్లోకి నెట్టారు.

మోసం చేసిన న్యాయవాది అరెస్టు
author img

By

Published : Sep 9, 2019, 11:48 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాఫీ చేస్తానంటూ ఐటీ ఉద్యోగిని మోసం చేసిన న్యాయవాదిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. చందానగర్​ ప్రాంతానికి చెందిన వెంకటపవన్​ కుమార్​ గత నెల 16న మద్యం తాగి గచ్చిబౌలి ప్రాంతంలో వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసిన అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పవన్​కుమార్​కు జైలు శిక్ష విధించింది. దీని నుంచి తప్పించుకునేందుకు స్థానిక న్యాయవాది భానుప్రసాద్​ను సంప్రదించాడు. అతను కేసు మాఫీ చేయడమే కాకుండా... వాహనాన్ని విడిపిస్తానని చెప్పి రూ.70 వేలు డిమాండ్​ చేశాడు. రూ.40 వేల విలువైన ఒక ఆపిల్​ వాచ్​, పదివేల నగదు ముందుగా ఇచ్చాడు. తరువాత న్యాయవాది నుంచి ఎలాంటి స్పందన లేదు. గత నెల 29 నుంచి మూడు రోజులు పాటు పవన్​ జైలు శిక్ష అనుభవించాడు. మోసపోయానని గ్రహించిన అతను న్యాయవాది భానుప్రసాద్​పై కేపీహెచ్​బీ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాఫీ చేస్తానంటూ ఐటీ ఉద్యోగిని మోసం చేసిన న్యాయవాదిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. చందానగర్​ ప్రాంతానికి చెందిన వెంకటపవన్​ కుమార్​ గత నెల 16న మద్యం తాగి గచ్చిబౌలి ప్రాంతంలో వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసిన అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పవన్​కుమార్​కు జైలు శిక్ష విధించింది. దీని నుంచి తప్పించుకునేందుకు స్థానిక న్యాయవాది భానుప్రసాద్​ను సంప్రదించాడు. అతను కేసు మాఫీ చేయడమే కాకుండా... వాహనాన్ని విడిపిస్తానని చెప్పి రూ.70 వేలు డిమాండ్​ చేశాడు. రూ.40 వేల విలువైన ఒక ఆపిల్​ వాచ్​, పదివేల నగదు ముందుగా ఇచ్చాడు. తరువాత న్యాయవాది నుంచి ఎలాంటి స్పందన లేదు. గత నెల 29 నుంచి మూడు రోజులు పాటు పవన్​ జైలు శిక్ష అనుభవించాడు. మోసపోయానని గ్రహించిన అతను న్యాయవాది భానుప్రసాద్​పై కేపీహెచ్​బీ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఇదీ చూడండి : గంజాయి స్వాధీనం... ఆరుగురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.