ETV Bharat / state

'గ్రేటర్ ఎన్నికల్లో  ఓల్డ్ బోయిన్​పల్లిలో హ్యాట్రిక్ కొట్టాలి' - ఓల్డ్ బోయిన్​పల్లిలో ఎన్నికలు

గ్రేటర్​ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్​పల్లి డివిజన్ కార్పొరేటర్​గా ముద్దం నర్సింహ యాదవ్ విజయం సాధించి హ్యాట్రిక్​ కొట్టాలని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకాంక్షించారు. ఈసారి కూడా డివిజన్ కార్పొరేటర్​ టికెట్ నర్సింహయాదవ్​కే కేటాయిస్తామని స్పష్టం చేశారు.

kukatpally mla krishna rao says that trs will win in old boinpally elections
కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
author img

By

Published : Sep 10, 2020, 2:55 PM IST

గ్రేటర్​ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్​పల్లి డివిజన్ కార్పొరేటర్​ టికెట్​ ముద్దం నర్సింహయాదవ్​కే కేటాయిస్తామని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్​ కొట్టాలని ఆకాంక్షించారు. డివిజన్​లో చేసిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు పరిష్కరించిన తీరును సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు.

గతంలో ఓల్డ్ బోయిన్​పల్లి ప్రజలు సమస్యలతో సతమతమవుతూ ఉండేవారని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారి సమస్యలు పరిష్కరించామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటివరకు ప్రజలు తెరాసను ఆదరిస్తూ విజయాలందించారని, గ్రేటర్ ఎన్నికల్లోనూ గొప్ప మెజార్టీని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రేటర్​ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్​పల్లి డివిజన్ కార్పొరేటర్​ టికెట్​ ముద్దం నర్సింహయాదవ్​కే కేటాయిస్తామని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్​ కొట్టాలని ఆకాంక్షించారు. డివిజన్​లో చేసిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు పరిష్కరించిన తీరును సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు.

గతంలో ఓల్డ్ బోయిన్​పల్లి ప్రజలు సమస్యలతో సతమతమవుతూ ఉండేవారని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారి సమస్యలు పరిష్కరించామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటివరకు ప్రజలు తెరాసను ఆదరిస్తూ విజయాలందించారని, గ్రేటర్ ఎన్నికల్లోనూ గొప్ప మెజార్టీని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.