ETV Bharat / state

KTR Comments on Congress and BJP : 'చేతిలోని రూపాయి పడేసి.. చిల్లర ఏరుకోవద్దు'

author img

By

Published : Jun 1, 2023, 3:56 PM IST

Updated : Jun 1, 2023, 7:38 PM IST

KTR Fires on Opposition Parties : రాబోయే ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారని.. కాంగ్రెస్, బీజేపీకి ధైర్యముంటే వారి సీఎం అభ్యర్థి ఎవరో వెల్లడించాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో తమతో పోటీ పడే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని.. భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణలో లేనే లేదని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో.. ఆ పార్టీ ఇష్టమన్న కేటీఆర్.. మతం ప్రాతిపదికనే ప్రజలు ఓట్లేస్తారని తాను విశ్వసించనన్నారు. దశాబ్ది తెలంగాణ సమగ్ర, సమతుల, సమ్మిళిత అభివృద్ధిని సాధించిందని కేటీఆర్ వివరించారు.

ktr
ktr

KTR on development of Telangana : పదేళ్లలో తెలంగాణ సమగ్ర, సమతుల, సమ్మిళిత అభివృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలనే స్పూర్తితో పదేళ్లుగా పనిచేసి విజయం సాధించినట్లు తెలిపారు. నూతన వైద్యశాలలు, పాఠశాలలు, గురుకులాల ఏర్పాటు, మనఊరు- మన బడి వంటి కార్యక్రమాలతో విద్య, వైద్య రంగాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందని కేటీఆర్ వివరించారు.

దేశంలో ఎక్కడా లేనంత వేగంగా రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిందని వివరించారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే విధానం నినాదంగా మారిందని తెలిపారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన కేటీఆర్ రాష్ట్రావిర్భావం దినోత్సవం సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

KTR Fires on Opposition Parties : ప్రతిపక్షాలు తొమ్మిదేళ్లుగా పనిలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. విపక్ష నేతలు ఒక్కసారి కూడా హేతుబద్ధంగా, ఆధారాలతో మాట్లాడ లేకపోయారని విమర్శించారు. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల పాలనతో.. తెలంగాణ పరిపాలనను బేరీజు వేసుకోవాలని కోరారు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ వివరించారు.

తెలంగాణ కన్నా మంచి మోడల్ ఉంటే చూపాలని కాంగ్రెస్, బీజేపీకి.. కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ రెండు పార్టీలు 75 ఏళ్లుగా చేయని పనిని.. కేవలం 9 సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. వారి పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతుంటే.. కేంద్ర మంత్రులు టాయిలెట్లు, రైల్వే స్టేషన్లలోని లిఫ్ట్‌లు ప్రారంభిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఇటీవలి విదేశీ పర్యటనలో తెలంగాణ బిడ్డల కోసం 42,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురాగలిగామని కేటీఆర్ తెలిపారు. సచివాలయం నిర్మాణం మొదలుకొని అన్ని విషయాల్లోనూ.. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించడం.. ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ ప్రకియ జాతీయ రహదారుల టెండర్ల మాదిరిగానే జరిగిందని వివరించారు. ఓఆర్‌ఆర్‌ టెండర్లపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మున్సిపల్ శాఖ ఇప్పటికే ప్రకటించిందని.. లీగల్ నోటీసులు అందుకున్న వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల వద్ద ఆధారాలుంటే కోర్టుకి సమర్పించాలని.. ప్రజల ముందు పెట్టాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR Comments on Congress : తెలంగాణలో బీజేపీ లేనేలేదని.. సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు హంగామా చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తమతో పోటీ పడే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వస్తామన్న భ్రమల్లో హస్తం పార్టీ ఉంటే వారిష్టమని.. షర్మిల, కేఏ పాల్ లాంటి వారు కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ 90 నుంచి 100 స్థానాల్లో సునాయసంగా గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

వచ్చే ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారని.. బీజేపీ, కాంగ్రెస్‌కు ధైర్యముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌లో మంచి పనితీరు ఉన్న ఎమ్మెల్యేల అందరికీ మళ్లీ సీట్లు దక్కుతాయని అన్నారు. అయితే ఈ క్రమంలోనే పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు తమను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.

ఇప్పుడే టికెట్లపై ఏమీ చెప్పలేం : ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నందున.. ఇప్పుడే టికెట్లపై ఏమీ చెప్పలేమని కేటీఆర్ వివరించారు. ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఆ పార్టీ ఇష్టమన్న కేటీఆర్.. ప్రజలు మత ప్రాతిపదికనే ఓట్లు వేస్తారంటే తాను నమ్మనన్నారు. తెలంగాణలో మైనార్టీలకు చేసిన కార్యక్రమాలపై ఇతర రాష్ట్రాల్లో గొప్పగా చెప్పిన అసదుద్దీన్ ఒవైసీ.. ఇక్కడ ఎందుకు భిన్నంగా మాట్లాడారో ఆయనే తేల్చుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మైనార్టీలు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మాత్రమే ఓట్లేస్తారని కాకుండా.. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని విశ్వసిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. కేవలం ఒక పార్టీని అధికారం నుంచి దించాలన్న ఆలోచన విధానానికి బీఆర్ఎస్ వ్యతిరేకమని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న మంచి విధానాలను.. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. దేశంలో కేవలం కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఉన్నాయన్న ప్రచారం, ఆలోచన విధానం తప్పని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

"కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ఒక పార్టీని కాకుండా.. ఎన్జీవోనో దుకాణాన్ని నడపాలి. గుజరాత్‌లో ఎన్నికలు జరిగితే పారిపోయిన రాహుల్ గాంధీ విషయం అందరికి తెలుసన్నారు. దేశంలో అత్యుత్తమ ప్రధాన మంత్రుల్లో ఒకరైన పీవీ నరసింహారావుకు దిల్లీలో సమాధి కట్టకుండా కాంగ్రెస్ పార్టీ అవమానం చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసే దిశగా ఆలోచిస్తున్నాం. ఏపీలోనూ బీఆర్ఎస్ పని ప్రారంభించింది. అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించాం." -కేటీఆర్, మంత్రి

KTR Fires on BJP : అన్ని రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. బీజేపీకి ధైర్యముంటే.. దేశానికి చేసిన మంచి పనులపై ప్రజల్లో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. గతంలో నోట్ల రద్దుతో ఏం సాధించారో ఇప్పటి వరకు చెప్పని ప్రధాని.. ఇప్పుడు రెండు వేల రూపాయల నోట్ల మార్పిడితో ఏం సాధిస్తారో కూడా.. ప్రజలకు సమాధానం చెప్పడం లేదన్నారు. లోక్ సభ స్థానాల పెంపుపై ఇప్పటి నుంచే ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వివరించారు.

దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అనేది తన వాదన కాదు : దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అనేది తన వాదన కాదని.. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోవద్దనే తన వాదనని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులు ఉండాలని వివరించారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో పెరిగే సీట్లు మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్నా ఎక్కువగా ఉండనున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మద్దతిచ్చిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదని.. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరని తెలిపారు. తాము పన్నులు చెల్లిస్తున్నామని... ఉచిత పథకాలు అనుచితం అంటున్న వారు.. దేశంలో ప్రతీ ఒక్కరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పన్నులు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి : KTR Tweet On BJP : 'రేపిస్టులను సన్మానించే.. ఛాంపియన్లను అవమానించే పార్టీ.. బీజేపీ'

Delimitation of parliament seats 2026 : 'ఆ క్రమశిక్షణే.. ఇప్పుడు పెద్ద రాజకీయ శిక్ష'

KTR on development of Telangana : పదేళ్లలో తెలంగాణ సమగ్ర, సమతుల, సమ్మిళిత అభివృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలనే స్పూర్తితో పదేళ్లుగా పనిచేసి విజయం సాధించినట్లు తెలిపారు. నూతన వైద్యశాలలు, పాఠశాలలు, గురుకులాల ఏర్పాటు, మనఊరు- మన బడి వంటి కార్యక్రమాలతో విద్య, వైద్య రంగాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందని కేటీఆర్ వివరించారు.

దేశంలో ఎక్కడా లేనంత వేగంగా రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిందని వివరించారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే విధానం నినాదంగా మారిందని తెలిపారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన కేటీఆర్ రాష్ట్రావిర్భావం దినోత్సవం సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

KTR Fires on Opposition Parties : ప్రతిపక్షాలు తొమ్మిదేళ్లుగా పనిలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. విపక్ష నేతలు ఒక్కసారి కూడా హేతుబద్ధంగా, ఆధారాలతో మాట్లాడ లేకపోయారని విమర్శించారు. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల పాలనతో.. తెలంగాణ పరిపాలనను బేరీజు వేసుకోవాలని కోరారు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ వివరించారు.

తెలంగాణ కన్నా మంచి మోడల్ ఉంటే చూపాలని కాంగ్రెస్, బీజేపీకి.. కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ రెండు పార్టీలు 75 ఏళ్లుగా చేయని పనిని.. కేవలం 9 సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. వారి పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతుంటే.. కేంద్ర మంత్రులు టాయిలెట్లు, రైల్వే స్టేషన్లలోని లిఫ్ట్‌లు ప్రారంభిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఇటీవలి విదేశీ పర్యటనలో తెలంగాణ బిడ్డల కోసం 42,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురాగలిగామని కేటీఆర్ తెలిపారు. సచివాలయం నిర్మాణం మొదలుకొని అన్ని విషయాల్లోనూ.. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించడం.. ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ ప్రకియ జాతీయ రహదారుల టెండర్ల మాదిరిగానే జరిగిందని వివరించారు. ఓఆర్‌ఆర్‌ టెండర్లపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మున్సిపల్ శాఖ ఇప్పటికే ప్రకటించిందని.. లీగల్ నోటీసులు అందుకున్న వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల వద్ద ఆధారాలుంటే కోర్టుకి సమర్పించాలని.. ప్రజల ముందు పెట్టాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR Comments on Congress : తెలంగాణలో బీజేపీ లేనేలేదని.. సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు హంగామా చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తమతో పోటీ పడే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వస్తామన్న భ్రమల్లో హస్తం పార్టీ ఉంటే వారిష్టమని.. షర్మిల, కేఏ పాల్ లాంటి వారు కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ 90 నుంచి 100 స్థానాల్లో సునాయసంగా గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

వచ్చే ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారని.. బీజేపీ, కాంగ్రెస్‌కు ధైర్యముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌లో మంచి పనితీరు ఉన్న ఎమ్మెల్యేల అందరికీ మళ్లీ సీట్లు దక్కుతాయని అన్నారు. అయితే ఈ క్రమంలోనే పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు తమను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.

ఇప్పుడే టికెట్లపై ఏమీ చెప్పలేం : ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నందున.. ఇప్పుడే టికెట్లపై ఏమీ చెప్పలేమని కేటీఆర్ వివరించారు. ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఆ పార్టీ ఇష్టమన్న కేటీఆర్.. ప్రజలు మత ప్రాతిపదికనే ఓట్లు వేస్తారంటే తాను నమ్మనన్నారు. తెలంగాణలో మైనార్టీలకు చేసిన కార్యక్రమాలపై ఇతర రాష్ట్రాల్లో గొప్పగా చెప్పిన అసదుద్దీన్ ఒవైసీ.. ఇక్కడ ఎందుకు భిన్నంగా మాట్లాడారో ఆయనే తేల్చుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మైనార్టీలు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మాత్రమే ఓట్లేస్తారని కాకుండా.. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని విశ్వసిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. కేవలం ఒక పార్టీని అధికారం నుంచి దించాలన్న ఆలోచన విధానానికి బీఆర్ఎస్ వ్యతిరేకమని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న మంచి విధానాలను.. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. దేశంలో కేవలం కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఉన్నాయన్న ప్రచారం, ఆలోచన విధానం తప్పని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

"కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ఒక పార్టీని కాకుండా.. ఎన్జీవోనో దుకాణాన్ని నడపాలి. గుజరాత్‌లో ఎన్నికలు జరిగితే పారిపోయిన రాహుల్ గాంధీ విషయం అందరికి తెలుసన్నారు. దేశంలో అత్యుత్తమ ప్రధాన మంత్రుల్లో ఒకరైన పీవీ నరసింహారావుకు దిల్లీలో సమాధి కట్టకుండా కాంగ్రెస్ పార్టీ అవమానం చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసే దిశగా ఆలోచిస్తున్నాం. ఏపీలోనూ బీఆర్ఎస్ పని ప్రారంభించింది. అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించాం." -కేటీఆర్, మంత్రి

KTR Fires on BJP : అన్ని రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. బీజేపీకి ధైర్యముంటే.. దేశానికి చేసిన మంచి పనులపై ప్రజల్లో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. గతంలో నోట్ల రద్దుతో ఏం సాధించారో ఇప్పటి వరకు చెప్పని ప్రధాని.. ఇప్పుడు రెండు వేల రూపాయల నోట్ల మార్పిడితో ఏం సాధిస్తారో కూడా.. ప్రజలకు సమాధానం చెప్పడం లేదన్నారు. లోక్ సభ స్థానాల పెంపుపై ఇప్పటి నుంచే ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వివరించారు.

దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అనేది తన వాదన కాదు : దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అనేది తన వాదన కాదని.. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోవద్దనే తన వాదనని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులు ఉండాలని వివరించారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో పెరిగే సీట్లు మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్నా ఎక్కువగా ఉండనున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మద్దతిచ్చిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదని.. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరని తెలిపారు. తాము పన్నులు చెల్లిస్తున్నామని... ఉచిత పథకాలు అనుచితం అంటున్న వారు.. దేశంలో ప్రతీ ఒక్కరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పన్నులు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి : KTR Tweet On BJP : 'రేపిస్టులను సన్మానించే.. ఛాంపియన్లను అవమానించే పార్టీ.. బీజేపీ'

Delimitation of parliament seats 2026 : 'ఆ క్రమశిక్షణే.. ఇప్పుడు పెద్ద రాజకీయ శిక్ష'

Last Updated : Jun 1, 2023, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.