ETV Bharat / state

సీఎల్పీ విలీనం దుర్మార్గం: కోమటిరెడ్డి - komatireddy

కేసీఆర్​ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ధ్వజమెత్తారు. డబ్బుతో రాజకీయాలను నడుపుతున్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

సీఎల్పీ విలీనం దుర్మార్గం: కోమటిరెడ్డి
author img

By

Published : Jun 9, 2019, 8:13 PM IST

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్​ చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షం లేకుంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేదెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేసీఆర్​ కుటుంబపాలన చేస్తూ దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస పాల్పడుతున్న చర్యలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, రాబోయే రోజుల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

సీఎల్పీ విలీనం దుర్మార్గం: కోమటిరెడ్డి

ఇదీ చదవండి: 'ఇది కాంగ్రెస్​దే కాదు... నాలుగు కోట్ల ప్రజల సమస్య'

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్​ చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షం లేకుంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేదెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేసీఆర్​ కుటుంబపాలన చేస్తూ దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస పాల్పడుతున్న చర్యలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, రాబోయే రోజుల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

సీఎల్పీ విలీనం దుర్మార్గం: కోమటిరెడ్డి

ఇదీ చదవండి: 'ఇది కాంగ్రెస్​దే కాదు... నాలుగు కోట్ల ప్రజల సమస్య'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.