ETV Bharat / state

పామాయిల్​ దిగుమతులను తగ్గించి.. ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం: కిషన్​రెడ్డి

author img

By

Published : Dec 22, 2022, 10:49 PM IST

Kishan reddy speech on palmoil cultivation: దేశంలో పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. పామాయిల్​ సాగు, ఉత్పత్తిలో స్యయం సమృద్ధి దిశగా అడుగుల వేయడానికి కేెంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ పామ్ కార్యక్రమం ఎంతో లాభాన్ని చేకూరుస్తుందనీ కేంద్రమంత్రి తెలిపారు.

Kishan reddy
Kishan reddy

Kishan reddy on Palm Oil Cultivation : కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు 5 సంవత్సరాల కాలానికి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ పామ్ కార్యక్రమానికి ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి జి.కిషన్​రెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 15 శాతం తెలంగాణలోనే ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ పామ్ కార్యక్రమం తెలంగాణ రైతులకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుందని ఆయన వివరించారు.

పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, 2025-26 నాటికి పామాయిల్ సాగును 10 లక్షల హెక్టార్లకు పెంచాలని, మరో 6.5 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలన్నదే ఆయిల్ పామ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కిషన్​రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ పథకం యొక్క మొత్తం అంచనా వ్యయం రూ.11,040 కోట్లు కాగా.. అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూ.8,844 కోట్లను ఖర్చు చేయనుందన్నారు.

మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా.. అందులో భారత ప్రభుత్వం చెల్లించవలసిన వాటా రూ.3,560 కోట్లని తెలిపారు. తెలంగాణలోని ఈ 4.36 లక్షల హెకార్ల భూమి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్​నగర్, మంచిర్యాల, మేడ్చల్ -మల్కాజిగిరి, నాగర్​కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి 27 జిల్లాల్లో విస్తరించి ఉందని తెలిపారు.

రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశంగా ఎన్​ఎమ్ఈఓ-ఓపీ మార్గదర్శకాలను రూపొందించటం జరిగిందన్నారు. ఎన్​ఎమ్ఈఓ-ఓపీ వనరులన్నింటినీ 17 శాతం ఎస్సీలకు, 8 శాతం ఎస్టీలకు లబ్ధి చేర్చటానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయింపులు చేయటానికి వీలు కల్పించటం జరిగిందన్నారు.

ఇవీ చదవండి:

Kishan reddy on Palm Oil Cultivation : కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు 5 సంవత్సరాల కాలానికి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ పామ్ కార్యక్రమానికి ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి జి.కిషన్​రెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 15 శాతం తెలంగాణలోనే ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ పామ్ కార్యక్రమం తెలంగాణ రైతులకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుందని ఆయన వివరించారు.

పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, 2025-26 నాటికి పామాయిల్ సాగును 10 లక్షల హెక్టార్లకు పెంచాలని, మరో 6.5 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలన్నదే ఆయిల్ పామ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కిషన్​రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ పథకం యొక్క మొత్తం అంచనా వ్యయం రూ.11,040 కోట్లు కాగా.. అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూ.8,844 కోట్లను ఖర్చు చేయనుందన్నారు.

మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా.. అందులో భారత ప్రభుత్వం చెల్లించవలసిన వాటా రూ.3,560 కోట్లని తెలిపారు. తెలంగాణలోని ఈ 4.36 లక్షల హెకార్ల భూమి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్​నగర్, మంచిర్యాల, మేడ్చల్ -మల్కాజిగిరి, నాగర్​కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి 27 జిల్లాల్లో విస్తరించి ఉందని తెలిపారు.

రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశంగా ఎన్​ఎమ్ఈఓ-ఓపీ మార్గదర్శకాలను రూపొందించటం జరిగిందన్నారు. ఎన్​ఎమ్ఈఓ-ఓపీ వనరులన్నింటినీ 17 శాతం ఎస్సీలకు, 8 శాతం ఎస్టీలకు లబ్ధి చేర్చటానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయింపులు చేయటానికి వీలు కల్పించటం జరిగిందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.