ETV Bharat / state

కవితకు అరుదైన గౌరవం

తెలంగాణ ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి సమ్మిట్​లో ప్రసంగించే అవకాశం దక్కింది. మార్చి1న దిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది.

author img

By

Published : Feb 16, 2019, 7:10 PM IST

Updated : Feb 16, 2019, 11:31 PM IST

కవితకు మరో అరుదైన గౌరవం

కవితకు మరో అరుదైన గౌరవం
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది. మార్చి 1న న్యూ దిల్లీలో 'యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్', 'గ్లోబల్ నెట్ వర్క్​ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న లింగసమానత్వ సదస్సులో ప్రసంగించాలని ఆహ్వానం అందింది. లింగ స‌మాన‌త్వం కోసం, ఎస్‌డీజీ ల‌క్ష్యాల సాధ‌నకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను గుర్తించి స‌మ్మిట్‌కు ఆమెను ఎంపిక చేశారు.
undefined

నాలెడ్జ్ భాగ‌స్వామి డెలాయిట్​తో కలిసి 4వ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధం చేయడం, భారతదేశంలో లింగ సమానత్వం అవార్డులను ప్ర‌దానం చేసే ప‌ద్ధ‌తులపైనా ఈ స‌దస్సులో చ‌ర్చిస్తారు. మ‌న దేశ వ్యాపారాలు, విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలకు బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ వేదికగా వ్యవహరిస్తోంది.

నాల్గవ పారిశ్రామిక విప్లవం ద్వారా వ్యాపార, సాంకేతికత, ఆటోమేషన్​లలో మానవ-డిజిటల్ ఇంటర్ఫేస్ పాత్ర పెరిగింది. దీని వ‌ల్ల మన దేశంలోనూ యువత ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం త‌ప్ప‌ని స‌రైంది. ఉపాధి, నైపుణ్య స‌ముపార్జ‌న‌లోనూ మహిళలు పురోగ‌మించేందుకు అవస‌ర‌మైన నైపుణ్యాలు, సాంకేతికంగా ప‌ట్టుసాధించ‌డం, విద్యావిధాన మార్పులపై కూలంకషంగా చ‌ర్చిస్తారు.

కవితకు మరో అరుదైన గౌరవం
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది. మార్చి 1న న్యూ దిల్లీలో 'యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్', 'గ్లోబల్ నెట్ వర్క్​ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న లింగసమానత్వ సదస్సులో ప్రసంగించాలని ఆహ్వానం అందింది. లింగ స‌మాన‌త్వం కోసం, ఎస్‌డీజీ ల‌క్ష్యాల సాధ‌నకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను గుర్తించి స‌మ్మిట్‌కు ఆమెను ఎంపిక చేశారు.
undefined

నాలెడ్జ్ భాగ‌స్వామి డెలాయిట్​తో కలిసి 4వ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధం చేయడం, భారతదేశంలో లింగ సమానత్వం అవార్డులను ప్ర‌దానం చేసే ప‌ద్ధ‌తులపైనా ఈ స‌దస్సులో చ‌ర్చిస్తారు. మ‌న దేశ వ్యాపారాలు, విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలకు బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ వేదికగా వ్యవహరిస్తోంది.

నాల్గవ పారిశ్రామిక విప్లవం ద్వారా వ్యాపార, సాంకేతికత, ఆటోమేషన్​లలో మానవ-డిజిటల్ ఇంటర్ఫేస్ పాత్ర పెరిగింది. దీని వ‌ల్ల మన దేశంలోనూ యువత ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం త‌ప్ప‌ని స‌రైంది. ఉపాధి, నైపుణ్య స‌ముపార్జ‌న‌లోనూ మహిళలు పురోగ‌మించేందుకు అవస‌ర‌మైన నైపుణ్యాలు, సాంకేతికంగా ప‌ట్టుసాధించ‌డం, విద్యావిధాన మార్పులపై కూలంకషంగా చ‌ర్చిస్తారు.
Intro:Body:Conclusion:
Last Updated : Feb 16, 2019, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.