పల్లె ప్లలెన పల్లేర్లు మొలిసే.. తెలంగాణలోన లాంటి పాటలు పోయి తెలంగాణ అభివృద్ధిపై ఎన్నో పాటలొచ్చాయని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత రోజూ పండుగ జరుగుతోందని కర్నె ప్రభాకర్ తెలిపారు. గతంలో పంచాయతీరాజ్ శాఖకు రూ.13 వేల కోట్ల నిధులు ఎప్పుడూ దాటలేదని తెలిపారు. కానీ తెరాస అధికారంలోకి వచ్చాక... ప్రస్తుతం 23 వేల కోట్లు కేటాయిస్తోందని స్పష్టం చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవడానికి సీఎం కేసీఆర్యే కారణమని కర్నె ప్రభాకర్ వివరించారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని నమ్ముకుని... పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలను పరిశుభ్రంగా మలిచిన ఘనత సీఎందని ప్రశంసించారు.
ఇవీ చూడండి: బైకుపై నుంచి పడ్డవారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి