భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని మాజీ ఎమ్మెల్సీ, తెరాస నేత కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. గోరెటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్కు కర్నె ప్రభాకర్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.
ఆరేళ్ల పాటు శాసన మండలిలో చట్టాల రూపకల్పనలో భాగస్వామయ్యేందుకు కేసీఆర్, కేటీఆర్ అవకాశం కల్పించారని.. వారికి కర్నె ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఆరేళ్ల పాటు ప్రజలు, ప్రభుత్వం కోసం పని చేశానన్న కర్నె ప్రభాకర్.. భవిష్యత్తులో ఏ చిన్న అవకాశం వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?