ETV Bharat / state

'సంక్షేమ పథకాల కోసం దళారులకు చిల్లిగవ్వ చెల్లించవద్దు'

author img

By

Published : Mar 10, 2020, 7:37 PM IST

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు... దళారులకు చిల్లిగవ్వ చెల్లించవద్దని ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్​ తెలిపారు. సికింద్రాబాద్​లోని నామాలగుండు క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను ఆయన అందించారు.

Deputy Speaker
Deputy Speaker

తెలంగాణలోని నిరుపేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్​లోని నామాలగుండు క్యాంపు కార్యాలయంలో 95 మందికి రూ.84 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను ఆయన అందించారు. పెళ్లీడుకు వచ్చిన బిడ్డల గురించి తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందని పద్మారావుగౌడ్ ​అన్నారు.

ప్రభుత్వ పథకాల అమల్లో దళారుల ప్రమేయం నివారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని... పేదలకు సీఎంఆర్ఎఫ్​ నిధులను ఎక్కువగా తామే కేటాయించామన్నారు. 75 కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను, 20 సీఎంఆర్​ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా డబ్బులడిగితే 040-27504448 నంబర్​కు ఫిర్యాదు చేయాలని ఉప సభాపతి సూచించారు. కార్పొరేటర్​ ఆలకుంట సరస్వతి, తహసీల్దార్​ సునీల్​కుమార్​, ప్రజాప్రతినిధులు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'సంక్షేమ పథకాల కోసం దళారులకు చిల్లిగవ్వ చెల్లించవద్దు'

ఇదీ చూడండి: రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు

తెలంగాణలోని నిరుపేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్​లోని నామాలగుండు క్యాంపు కార్యాలయంలో 95 మందికి రూ.84 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను ఆయన అందించారు. పెళ్లీడుకు వచ్చిన బిడ్డల గురించి తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందని పద్మారావుగౌడ్ ​అన్నారు.

ప్రభుత్వ పథకాల అమల్లో దళారుల ప్రమేయం నివారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని... పేదలకు సీఎంఆర్ఎఫ్​ నిధులను ఎక్కువగా తామే కేటాయించామన్నారు. 75 కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను, 20 సీఎంఆర్​ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా డబ్బులడిగితే 040-27504448 నంబర్​కు ఫిర్యాదు చేయాలని ఉప సభాపతి సూచించారు. కార్పొరేటర్​ ఆలకుంట సరస్వతి, తహసీల్దార్​ సునీల్​కుమార్​, ప్రజాప్రతినిధులు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'సంక్షేమ పథకాల కోసం దళారులకు చిల్లిగవ్వ చెల్లించవద్దు'

ఇదీ చూడండి: రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.