ETV Bharat / state

నేటి నుంచి జేఈఈ మెయిన్ 2వ విడత ఆన్​లైన్ పరీక్షలు - Telangana news

నేటి నుంచి ఈనెల 18 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో... ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నేటి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు
నేటి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు
author img

By

Published : Mar 16, 2021, 4:50 AM IST

జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు నేటి నుంచి ఈనెల 18 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 10 వేల మంది హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో... ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తెలంగాణ, ఏపీలో...

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో.. ఆంధ్రప్రదేశ్​లో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో జేఈఈ మెయిన్ కేంద్రాలను సిద్ధం చేశారు.

కరోనా డిక్లరేషన్...

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రంలో ఉండాలని ఎన్​టీఏ స్పష్టం చేసింది. ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమకు కరోనా లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ గత నెల 23 నుంచి 26 వరకు జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కూడా నిర్వహించి నాలుగింటిలో అత్యుత్తమ స్కోరు ఆధారంగా ర్యాంకు ఖరారు చేస్తారు.

ఇవీచూడండి: ప్రజల పురోగతికి కట్టుబడి.. దేశానికే ఆదర్శంగా నిలిచాం: గవర్నర్​

జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్షలు నేటి నుంచి ఈనెల 18 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 10 వేల మంది హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో... ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తెలంగాణ, ఏపీలో...

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో.. ఆంధ్రప్రదేశ్​లో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో జేఈఈ మెయిన్ కేంద్రాలను సిద్ధం చేశారు.

కరోనా డిక్లరేషన్...

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రంలో ఉండాలని ఎన్​టీఏ స్పష్టం చేసింది. ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమకు కరోనా లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ గత నెల 23 నుంచి 26 వరకు జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కూడా నిర్వహించి నాలుగింటిలో అత్యుత్తమ స్కోరు ఆధారంగా ర్యాంకు ఖరారు చేస్తారు.

ఇవీచూడండి: ప్రజల పురోగతికి కట్టుబడి.. దేశానికే ఆదర్శంగా నిలిచాం: గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.