మిషన్ భగీరథ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్లు, సహాయ ఇంజనీర్లు, టెక్నికల్ సిబ్బంది మొత్తం 642 మంది 2019 నుంచి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిని క్రమబద్ధీకరించాలని మిషన్ భగీరథ ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించారని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు.
ఫలితంగా పైప్లైన్ లీకేజీలు, నిరంతరం తనిఖీలకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే సకాలంలో వేతనాలు ఇవ్వాలన్నారు. ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరించాలని చాడ ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి : అర్వింద్పై దాడి అనైతికం.. మూల్యం తప్పదు: బండి సంజయ్