హైదరాబాద్ హిమాయత్నగర్లోని మాక్దుంభవన్లో భారత జాతీయ మహిళా సమాఖ్య బతుకమ్మ పండుగ వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు. మహిళలకు కావాల్సింది బతుకమ్మ చీరలు కాదని... స్వేచ్ఛగా తిరిగే భద్రత కావాలని అభిప్రాయపడింది. ప్రత్యేక తెలంగాణపై మహిళలలో చైతన్యం తీసుకొని రావడానికి బతుకమ్మ పండుగ దోహదపడిందని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి :ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లో భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్