ETV Bharat / state

జంట నగరాల్లో మెట్రోకు పెరిగిన ఆదరణ

author img

By

Published : Oct 21, 2019, 5:28 AM IST

ఆర్టీసీ సమ్మెతో సరిపడా సిటీ బస్సులు లేకపోవడం వల్ల.. నగరంలో మెట్రోను ఆదరిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. గతంలో ఉన్న రికార్డును అధిగమించి.. ఆదివారం ఒక్కరోజే ప్రయాణికుల సంఖ్య 3 లక్షల 80 వేలకు చేరుకుంది.

మెట్రోకు పెరిగిన ఆదరణ

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జంట నగరాల్లో మెట్రో రైళ్ల​లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య.. క్రమంగా పెరుగుతోంది. ప్రైవేటు బస్సులను తిప్పుతున్నా.. అవి సరిపోక ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నారు. ప్రధానంగా, మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సమ్మెతో రైళ్ల సమయాన్ని కూడా.. అధికారులు పొడిగించారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంచుతున్నారు. దసరా సెలవుల తర్వాత... నగరానికి వచ్చే వారితోఎంజీబీఎస్, ఉప్పల్‌, ఎల్బీ నగర్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు జనాలతో కిటకిటలాడతున్నాయి.

810 ట్రిప్పులు..

ప్రస్తుతం రోజువారీ మెట్రో ట్రిప్పులు 710 నడుస్తున్నాయి. సమ్మె కారణంగా 100 పెంచగా... మొత్తం 810 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో 6 నిమిషాల మెట్రో రైల్‌ ఫ్రీక్వెన్సీ ఉండగా.. ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే సమయాల్లో అంతకంటే తగ్గిస్తున్నారు. ప్రస్తుతం 3 నిమిషాలకు ఒక మెట్రో రైల్‌ నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ... సైబర్ టవర్స్ వెళ్లే ఉద్యోగులు.. మెట్రో రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం అదనంగా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు.. అధికారులు వెల్లడించారు.

నేటి నుంచి విద్యా సంస్థలు కూడా తెరుచుకుంటున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉంది.

మెట్రోకు పెరిగిన ఆదరణ

ఇదీ చదవండిః ప్లాస్టిక్​ను పారదోలకుంటే... భవిష్యత్తు అంధకారమే!

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జంట నగరాల్లో మెట్రో రైళ్ల​లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య.. క్రమంగా పెరుగుతోంది. ప్రైవేటు బస్సులను తిప్పుతున్నా.. అవి సరిపోక ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నారు. ప్రధానంగా, మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సమ్మెతో రైళ్ల సమయాన్ని కూడా.. అధికారులు పొడిగించారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంచుతున్నారు. దసరా సెలవుల తర్వాత... నగరానికి వచ్చే వారితోఎంజీబీఎస్, ఉప్పల్‌, ఎల్బీ నగర్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు జనాలతో కిటకిటలాడతున్నాయి.

810 ట్రిప్పులు..

ప్రస్తుతం రోజువారీ మెట్రో ట్రిప్పులు 710 నడుస్తున్నాయి. సమ్మె కారణంగా 100 పెంచగా... మొత్తం 810 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో 6 నిమిషాల మెట్రో రైల్‌ ఫ్రీక్వెన్సీ ఉండగా.. ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే సమయాల్లో అంతకంటే తగ్గిస్తున్నారు. ప్రస్తుతం 3 నిమిషాలకు ఒక మెట్రో రైల్‌ నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ... సైబర్ టవర్స్ వెళ్లే ఉద్యోగులు.. మెట్రో రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం అదనంగా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు.. అధికారులు వెల్లడించారు.

నేటి నుంచి విద్యా సంస్థలు కూడా తెరుచుకుంటున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉంది.

మెట్రోకు పెరిగిన ఆదరణ

ఇదీ చదవండిః ప్లాస్టిక్​ను పారదోలకుంటే... భవిష్యత్తు అంధకారమే!

TG_HYD_01_21_Heavy_Rush_On_Metro_Pkg_3182301 Reporter: Kartheek నోట్ః ఫీడ్ డెస్క్ వాట్సాప్ () హైదరాబాద్ మెట్రో రైలులో రికార్డు స్థాయిలో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో సరిపడ సిటీ బస్సులు లేకపోవడంతో నగరంలో మెట్రో ను ఆదరిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్ల ఫ్రీక్వేన్సీతో పాటు.....100 రైళ్ల ట్రిప్పులను పెంచారు. గతంలో ఉన్న రికార్డును అధిగమించి ఒక్కరోజే ఈ సమ్మెతో ప్రయాణికుల సంఖ్య 3 లక్షల 80 వేలకు చేరుకుంది. Look వాయిస్ ఓవర్‌ః రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ లో మెట్రో రైల్ ను ఆదరిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో జంటనగారాల్లో మెట్రో రైళ్లు రద్దీగా మారాయి. ప్రైవేటు బస్సులను తిప్పుతున్నా..అవి సరిపోక ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళుతున్నారు. ప్రధానంగా ఎమ్ ఎమ్ టీఎస్ , మెట్రో రైల్ లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీ సమ్మెతో మెట్రో రైళ్ల సమాయాన్ని కూడా అధికారులు పొడిగించారు. ఉదయం 5 నుంచి అర్ద రాత్రి వరకు మెట్రో సర్వీసులు అందుబాటు లో ఉంచుతున్నారు. ఇటీవల దసరా సెలవుల తర్వాత నగరానికి వచ్చే వారు ముఖ్యంగా ఎమ్ జిబీఎస్, ఉప్పల్ , ఎల్బీనగర్, జెబిఎస్, సికింద్రబాద్ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన ఏరియాల్లోని మెట్రో రూట్ పబ్లిక్ తో కిటకిటలాడాయి. వాయిస్ ఓవర్‌ః ప్రస్తుతం రెగ్యులర్ మెట్రో 710 ట్రిప్పులను నడుస్తున్నాయి. అయితే సమ్మే కారణంగా 100 ట్రిప్ లు పెంచడంతో మొత్తం 810 మెట్రో ట్రిప్పులను తిరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. సాధారణంగా మెట్రో లో ప్రతి రోజు 3లక్షల 50 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. అయితే సమ్మె కారణంగా మరో 80 వేల మంది అధనంగా మెట్రో ఎక్కుతున్నారు. మెట్రో ఎక్కిన స్టేషన్స్ నుంచి ఆటోలో, షేరింగ్ క్యాబ్స్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. గతంలో 6 నిమిషాలకు ఫ్రీక్వెన్సీ ఉండగా.... ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే సమాయాల్లో ఫ్రీక్వెన్సీ అంతకంటే తగ్గిస్తున్నారు. ప్రస్తుతం 3 నిమిషాలకు ఒక మెట్రో ట్రైన్ నడపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ వెళ్లే ఉద్యోగులు మెట్రో రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీనికోసం అధనంగా టికేట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బైట్ః ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎండ్ వాయిస్ః ఇక రేపటి నుంచి విద్యా సంస్థలు కూడా తెరుచుకునే అవకాశం ఉండడంతో మరింత ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.