ETV Bharat / state

'అంబేడ్కర్​ స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు ఎదగాలి' - CORONA UPDATES

హైదరాబాద్​ నాంపల్లిలోని ఆదాయపన్ను శాఖ భవనంలో అంబేడ్కర్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అధికారులంతా నిలోఫర్​ ఆసుపత్రిలోని చిన్నారులు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

INCOME TAX OFFICERS DISTRIBUTED IN NELOFER HOSPITAL
'అంబేడ్కర్​ స్ఫూర్తితోనే ప్రతీ ఒక్కరు ఎదగాలి'
author img

By

Published : Apr 14, 2020, 6:56 PM IST

రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతిని ఆదాయపన్ను శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ అధికారుల సంక్షేమ సంఘం హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించింది. నాంపల్లిలోని ఆదాయపన్ను శాఖ భవనంలో అంబేడ్కర్​ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మేధావిగా అంబేడ్కర్​ గుర్తింపు తెచ్చుకున్నారని ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కొనియాడారు. ఆ మహనీయుని స్ఫూర్తితోనే తాము ఉద్యోగాలు పొంది, ఉన్నత స్థాయికి ఎదిగామని గుర్తుచేసుకున్నారు. లాక్​డౌన్​ వల్ల దేశంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు రోజూ తమ వంతు సహాయం చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి: పాఠాలు వల్లించే అధికారులే పట్టాలు తప్పుతున్నారు!

రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతిని ఆదాయపన్ను శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ అధికారుల సంక్షేమ సంఘం హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించింది. నాంపల్లిలోని ఆదాయపన్ను శాఖ భవనంలో అంబేడ్కర్​ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మేధావిగా అంబేడ్కర్​ గుర్తింపు తెచ్చుకున్నారని ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కొనియాడారు. ఆ మహనీయుని స్ఫూర్తితోనే తాము ఉద్యోగాలు పొంది, ఉన్నత స్థాయికి ఎదిగామని గుర్తుచేసుకున్నారు. లాక్​డౌన్​ వల్ల దేశంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు రోజూ తమ వంతు సహాయం చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి: పాఠాలు వల్లించే అధికారులే పట్టాలు తప్పుతున్నారు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.