హైదరాబాద్లో ఎస్సార్డీపీ, సీఆర్ఎంపీ పనుల వేగవంతానికి లాక్డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని మేయర్ బొంతురామ్మోహన్ అన్నారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణం, ఆర్వోబీలు, రోడ్ల విస్తరణ, రోడ్డు మెయింటెనెన్స్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. లాక్ డౌన్ పూర్తయ్యే లోపు మెజారిటీ పనులు పూర్తి చేయటమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఇబ్బందులు లేని కారణంగా రోడ్ల సుందరీకరణ, విస్తరణ కొరకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామంటోన్న మేయర్ బొంతు రామ్మోహన్తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
ఇదీ చూడండి: 'కరోనాపై పోరు సాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం'