శివరాత్రి సందర్భంగా కోటి రూపాయలతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శివార్చన నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడను దర్శించే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ను ఆదేశించారు. వేములవాడ పురపాలక నూతన ఛైర్ పర్సన్ మాధవి, వైస్ ఛైర్మన్ మధు.. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్తో కలిసి వెళ్లి మంత్రి కేటీఆర్ను కలిశారు.
వేములవాడ పట్టణం, ఆలయం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పురపాలకలో సుపరిపాలనకు నడుం బిగించాలని నూతన ప్రజా ప్రతినిధులకు సూచించారు.