కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సికింద్రాబాద్ అల్వాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సీఆర్పీఎఫ్, టీం సాయి ప్యాండెమిక్ టాస్క్ ఫోర్స్ సంస్థ భాగస్వాములుగా అల్వాల్, లోతుకుంట ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై ద్రావణాన్ని చల్లారు. రోజూ నగర వ్యాప్తంగా 50 వేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అన్నిచోట్లా పిచికారీ చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కరోనా భయంతో మానసికంగా కుంగిపోయిన వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు