రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ను హైదరాబాద్ నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ స్వీకరించారు. సికింద్రాబాద్లోని పోలీస్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. అనంతరం జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వజిత్ ప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్కు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.
తెలంగాణను పచ్చదనంతో నింపేందుకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో తనను భాగస్వామ్యం చేసినందుకు అడిషనల్ సీపీ అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
- ఇవీ చూడండి: చెట్టును ఢీకొట్టిన కారు... నలుగురు దుర్మరణం