హైదరాబాద్ పాతబస్తీలో వినాయక ప్రతిమను క్యారం బోర్డు, చెస్ కాయిన్లతో తయారు చేసి కొత్త ఒరవడి సృష్టించారు. గొల్లకిడికి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ వినాయకుడిని తయారుచేయడానికి వీరికి 15 రోజుల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. 25 వేల కాయిన్లు అవసరమయ్యాయని పేర్కొన్నారు. ఈ వినాయకుడిని చూడటానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తున్నారు.
ఇదీ చూడండి : కరెంట్ షాక్తో పడిపోయింది.. సపర్యలతో బతికింది..