గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ శ్వేత మహంతి జాతీయ జెండాను ఎగురవేసి.. సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:లైవ్ అప్డేట్స్: గణతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శన