ETV Bharat / state

వజ్రాలహారం మాయం... విలువెంతో తెలుసా?

author img

By

Published : Dec 9, 2019, 3:50 PM IST

బంజారాహిల్స్​లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ. కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

huge-thief-in-banjarahills
huge-thief-in-banjarahills
బంజారాహిల్స్​లో భారీ చోరీ

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని ఒక వ్యాపారి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ కథనం ప్రకారం రోడ్డు నంబరు 12లో నివాసం కపిల్‌ గుప్తా అనే వ్యాపారి ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చిన ఆయన గదిలోని అల్మారా తెరచి ఉండటాన్ని గమనించారు. అందులో పరిశీలించగా సుమారు. రూ.కోటి విలువైన వజ్రాల హారం ఒకటి కనిపించలేదు. అదే సమయంలో ఇంట్లో పనికి చేరిన వ్యక్తి కూడా అదృశ్యమైనట్లు గుర్తించారు. 40 రోజుల కిందట బిహార్‌కు చెందిన రామ్‌ నివాస్‌ అలియాస్‌ కరణ్‌ అనే వ్యక్తి వ్యాపారి ఇంట్లో పనికి చేరాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి కరణ్‌ చరవాణికి కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. అనుమానం వచ్చిన వ్యాపారి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్‌ ఏర్పాటు

బంజారాహిల్స్​లో భారీ చోరీ

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని ఒక వ్యాపారి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ కథనం ప్రకారం రోడ్డు నంబరు 12లో నివాసం కపిల్‌ గుప్తా అనే వ్యాపారి ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చిన ఆయన గదిలోని అల్మారా తెరచి ఉండటాన్ని గమనించారు. అందులో పరిశీలించగా సుమారు. రూ.కోటి విలువైన వజ్రాల హారం ఒకటి కనిపించలేదు. అదే సమయంలో ఇంట్లో పనికి చేరిన వ్యక్తి కూడా అదృశ్యమైనట్లు గుర్తించారు. 40 రోజుల కిందట బిహార్‌కు చెందిన రామ్‌ నివాస్‌ అలియాస్‌ కరణ్‌ అనే వ్యక్తి వ్యాపారి ఇంట్లో పనికి చేరాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి కరణ్‌ చరవాణికి కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. అనుమానం వచ్చిన వ్యాపారి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్‌ ఏర్పాటు

TG_Hyd_24_09_Banjarahills_Donga_thanam_AV_TS10021 Contributor: V. Raghu Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివసిస్తున్న వ్యాపారవేత్త కపిల్ గుప్త కుటుంబంతో సహా నిన్న సాయంత్రం ఓ శుభకార్య నిమిత్తం ఇంటినుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లోని సామానులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి చూడగా అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురయినట్లు గుర్తించారు. తన ఇంటిలో పనిచేసే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు కపిల్ గుప్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.