ETV Bharat / state

'రోజుకు ఆరు నిమిషాలే ఇస్తే ఎలా మాట్లాడాలి'

author img

By

Published : Sep 8, 2020, 3:56 PM IST

రాష్ట్ర శాసనసభలో అధికార పక్షం ప్రతిపక్షాలను తొక్కేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి కేవలం ఆరు నిమిషాల సమయం మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్​ను పునరుద్ధరించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని జీవన్​ రెడ్డి కోరారు.

How to congress leaders speak if given six minutes a day at ts assembly
'రోజుకు ఆరు నిమిషాలు ఇస్తే ఎలా మాట్లాడాలి'
'రోజుకు ఆరు నిమిషాలు ఇస్తే ఎలా మాట్లాడాలి'

ప్రజా సమస్యలకు పరిష్కారం లభించే దేవాలయం లాంటి శాసనసభలో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 19 మంది శాసన సభ్యులున్న కాంగ్రెస్ సభ్యుల్లో కొందరిని కేసీఆర్ కోరుకున్నారని అన్నారు.

ఇప్పుడు ఉన్న సభ్యుల ప్రకారమే సమయం కేటాయిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్​ సభ్యలకు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి సమయం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని అన్నారు.

ప్రజా సమస్యల పట్ల మాట్లాడే అవకాశం కాంగ్రెస్​కు ఇవ్వడం లేదని ఎంఎల్​సీ జీవన్​ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ తొలగించడం అప్రజాస్వామికం అని అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోందని విమర్శించారు. స్పీకర్ మీడియా పాయింట్​ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి : సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో కాలుష్య ప్రభావంపై నిపుణుల కమిటీ

'రోజుకు ఆరు నిమిషాలు ఇస్తే ఎలా మాట్లాడాలి'

ప్రజా సమస్యలకు పరిష్కారం లభించే దేవాలయం లాంటి శాసనసభలో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 19 మంది శాసన సభ్యులున్న కాంగ్రెస్ సభ్యుల్లో కొందరిని కేసీఆర్ కోరుకున్నారని అన్నారు.

ఇప్పుడు ఉన్న సభ్యుల ప్రకారమే సమయం కేటాయిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్​ సభ్యలకు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి సమయం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని అన్నారు.

ప్రజా సమస్యల పట్ల మాట్లాడే అవకాశం కాంగ్రెస్​కు ఇవ్వడం లేదని ఎంఎల్​సీ జీవన్​ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ తొలగించడం అప్రజాస్వామికం అని అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోందని విమర్శించారు. స్పీకర్ మీడియా పాయింట్​ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి : సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో కాలుష్య ప్రభావంపై నిపుణుల కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.