ETV Bharat / state

కూలిన భవనం పైకప్పు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు - హైదరాబాద్​ జిల్లా తాజా వార్తలు

హైదరాబాద్​ శివారులో మంగళవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు వద్ద ఓ భవనం పైకప్పు కూలగా.. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కూలిన భవనం పైకప్పు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
కూలిన భవనం పైకప్పు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
author img

By

Published : Aug 5, 2020, 10:47 AM IST

Updated : Aug 5, 2020, 2:26 PM IST

కూలిన భవనం పైకప్పు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ శివారులో మంగళవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు వద్ద ఓ భవనం పైకప్పు కూలింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆ భవనానికి కాంక్రీట్​ వేస్తుండంగా అకస్మాత్తుగా ఇంటిపైకప్పు కూలింది.

సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని జీహెచ్​ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

కూలిన భవనం పైకప్పు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ శివారులో మంగళవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు వద్ద ఓ భవనం పైకప్పు కూలింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆ భవనానికి కాంక్రీట్​ వేస్తుండంగా అకస్మాత్తుగా ఇంటిపైకప్పు కూలింది.

సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని జీహెచ్​ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

Last Updated : Aug 5, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.