హైదరాబాద్ రామ్నగర్లోని సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ 2k 20 ఫెస్ట్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవవసాయం, డిజిటల్ మార్కెటింగ్, ట్రావెల్ టూరిజం, న్యూట్రీ బార్, పౌష్టికాహారం తదితర విషయాలపై చేసిన ప్రదర్శనలు సందేశాత్మకంగా నిలిచాయి.
యువతులపై లైంగికదాడులు, మానసిక వేధింపులపై ప్రదర్శించిన నృత్య రూపకం ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసింది. డిజిటల్ మార్కెటింగ్తో డబ్బు, సమయం ఆదా వంటి విషయాలను విద్యార్థులు అలరించిన తీరు ఆకట్టుకుంది. విద్యార్థులను సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపక డైరెక్టర్ వాణి అభినందించారు.
ఇదీ చూడండి: భాజపాలో చేరాక నేను నేర్చుకున్న మొదటి నినాదం అదే