ETV Bharat / state

ఈసారి 105 సీట్లు గెలుచుకుంటాం: మహమూద్ అలీ

author img

By

Published : Nov 29, 2020, 3:08 PM IST

జియాగూడ బైక్ ర్యాలీలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 105 సీట్లు గెలుచుకుంటామని మహమూద్ అలీ జోస్యం చెప్పారు. కార్వాన్ అభ్యర్థి ముత్యాల భాస్కర్, మిత్ర కృష్ణలకు మద్దతుగా ఆయన జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

home-minister-mahmood-ali-this-time-we-will-win-105-seats
ఈసారి 105 సీట్లు గెలుచుకుంటాం: మహమూద్ అలీ

ఈసారి 105 సీట్లు గెలుచుకుంటాం: మహమూద్ అలీ

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. కార్వాన్ అభ్యర్థి ముత్యాల భాస్కర్, మిత్ర కృష్ణలకు మద్దతుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. డివిజన్ మొత్తం పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస 105 సీట్లు గెలుచుకుంటుందని మహమూద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో కచ్చితంగా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : 'బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు'

ఈసారి 105 సీట్లు గెలుచుకుంటాం: మహమూద్ అలీ

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. కార్వాన్ అభ్యర్థి ముత్యాల భాస్కర్, మిత్ర కృష్ణలకు మద్దతుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. డివిజన్ మొత్తం పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస 105 సీట్లు గెలుచుకుంటుందని మహమూద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ ఆధ్వర్యంలో కచ్చితంగా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : 'బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.