ETV Bharat / state

ఆన్​లైన్​లో ఓటర్ల సమాచారం తొలగించడం కష్టమే..!

ఆన్​ లైన్లో ఓటరు సమాచారం తొలగించడం కష్టమేనని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రస్తుతమున్న సమాచారాన్ని తొలగించాలంటూ వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ అవసరమని తెలిపింది.

author img

By

Published : Mar 19, 2019, 10:35 AM IST

Updated : Mar 19, 2019, 3:38 PM IST

'తొలగించడం అసంభవం..!'
'తొలగించడం అసంభవం..!'
ఓటరు కార్డుతో అనుసంధానం చేసిన వ్యక్తిగత సమాచారాన్ని..ఆన్​ లైన్ నుంచి తొలగించడం అంత సులభం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌ అన్నది ఓ మాయాబజార్‌లాంటిదని, ఒకసారి సమాచారాన్ని పంపితే... అది మిలియన్ల కొద్దీ కాపీ అయిపోతుందని పేర్కొంది. ఒక వేళ సమాచారాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినా... బగ్‌ పలుమార్లు పునఃసృష్టిస్తుందని తెలిపింది. అసలు తొలగించిన ఆనవాళ్లు కూడా ఉండవని అభిప్రాయపడింది. తమకున్న అవగాహన మేరకు ఇది అసంభవమేనని వ్యాఖ్యానించింది. ఆన్​లైన్ లో సమాచారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నందున...ఈ అశంపై పూర్తిస్థాయిలో తుది విచారణ చేపడతామని పేర్కొంది.

ఓటర్ల జాబితాకు అనుసరిస్తున్న సాఫ్ట్‌వేర్‌, అల్గారిథమ్ పారదర్శకంగా ఉంచేలా ఆదేశించాలని, సోర్స్‌ కోడ్‌ వెల్లడించాలని, సాప్ట్‌వేర్‌కు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్ జరిపించి ఆధార్‌ సమాచారాన్ని తొలగించాలని కోరుతూ హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ కొడాలి గత ఏడాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.అర్జున్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌కు అందజేస్తున్న వివరాలు, ఓటర్లకు సంబంధించిన ఆధార్‌కార్డు వంటి వాటితో సహా ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ కులం, కేటగిరీతదితర వివరాలన్నీ బయటికి పొక్కుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం వల్ల ఒక కులం, వర్గాన్ని ఎంపిక చేసుకుని సాఫ్ట్‌వేర్‌తో తొలగిస్తున్నారన్నారు. తెలంగాణలో 27 లక్షలు, ఏపీలో 19లక్షల ఓటర్లను తొలగించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానం పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నారు.

నకిలీ ఓటర్ల తొలగింపులో రాష్ట్రప్రభుత్వాల పాత్రకు సంబంధించి ఆధారాలు లేనపుడు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఆధార్‌ డేటా తొలగింపుతో సహా రాష్ట్రప్రభుత్వాల పాత్రకు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ అనుబంధ పిటిషన్‌లను కొట్టివేసింది. అయితే ఆధార్‌ డేటా తొలగింపు విచారణాంశమని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని తెలిపింది.

ఇవీ చదవండి:కన్నడనాడి: ఓట్ల బదిలీ సాధ్యమేనా?

'తొలగించడం అసంభవం..!'
ఓటరు కార్డుతో అనుసంధానం చేసిన వ్యక్తిగత సమాచారాన్ని..ఆన్​ లైన్ నుంచి తొలగించడం అంత సులభం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌ అన్నది ఓ మాయాబజార్‌లాంటిదని, ఒకసారి సమాచారాన్ని పంపితే... అది మిలియన్ల కొద్దీ కాపీ అయిపోతుందని పేర్కొంది. ఒక వేళ సమాచారాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినా... బగ్‌ పలుమార్లు పునఃసృష్టిస్తుందని తెలిపింది. అసలు తొలగించిన ఆనవాళ్లు కూడా ఉండవని అభిప్రాయపడింది. తమకున్న అవగాహన మేరకు ఇది అసంభవమేనని వ్యాఖ్యానించింది. ఆన్​లైన్ లో సమాచారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నందున...ఈ అశంపై పూర్తిస్థాయిలో తుది విచారణ చేపడతామని పేర్కొంది.

ఓటర్ల జాబితాకు అనుసరిస్తున్న సాఫ్ట్‌వేర్‌, అల్గారిథమ్ పారదర్శకంగా ఉంచేలా ఆదేశించాలని, సోర్స్‌ కోడ్‌ వెల్లడించాలని, సాప్ట్‌వేర్‌కు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్ జరిపించి ఆధార్‌ సమాచారాన్ని తొలగించాలని కోరుతూ హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ కొడాలి గత ఏడాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.అర్జున్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌కు అందజేస్తున్న వివరాలు, ఓటర్లకు సంబంధించిన ఆధార్‌కార్డు వంటి వాటితో సహా ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ కులం, కేటగిరీతదితర వివరాలన్నీ బయటికి పొక్కుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం వల్ల ఒక కులం, వర్గాన్ని ఎంపిక చేసుకుని సాఫ్ట్‌వేర్‌తో తొలగిస్తున్నారన్నారు. తెలంగాణలో 27 లక్షలు, ఏపీలో 19లక్షల ఓటర్లను తొలగించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానం పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నారు.

నకిలీ ఓటర్ల తొలగింపులో రాష్ట్రప్రభుత్వాల పాత్రకు సంబంధించి ఆధారాలు లేనపుడు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఆధార్‌ డేటా తొలగింపుతో సహా రాష్ట్రప్రభుత్వాల పాత్రకు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ అనుబంధ పిటిషన్‌లను కొట్టివేసింది. అయితే ఆధార్‌ డేటా తొలగింపు విచారణాంశమని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని తెలిపింది.

ఇవీ చదవండి:కన్నడనాడి: ఓట్ల బదిలీ సాధ్యమేనా?

Intro:tg_mbnr_04_18_C vigil_pi_avagahana_avb_c6
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సి విజిల్ ఎన్నికల సక్రమంగా జరిగేందుకు ఎన్నికల సంఘం సివిల్ ను ఏర్పాటు చేసింది. ఎన్నికలకు కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా చేసినచో ఎవరైనా సి విజిల్ లో ఫిర్యాదు చేయవచ్చని జోగులాంబ జిల్లా సంయుక్త కలెక్టర్ నిరంజన్ తెలిపారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సివిల్ కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ నిరంజన్ మరియు ఆర్డిఓ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడు సి విజిల్ లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు ఎన్నికలు గద్వాల ఆర్డిఓ రాములు విద్యార్థులకు సూచించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ఆ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎన్నికలకు నిబంధనలకు విరుద్ధంగా మీ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా చేసినచో మీరు సి విజిల్ లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు రు. పార్లమెంట్ ఎన్నికల్లో సజావుగా జరిగేందుకు విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించాలని విద్యార్థులకు జిల్లా సంయుక్త కలెక్టర్ అన్నారు.


Body:babanna


Conclusion:gadwal
Last Updated : Mar 19, 2019, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.