ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టులో ఇవాళ కూడా వాదనలు జరిగాయి. పాత రాష్ట్రాలే కొత్తగా అసెంబ్లీలు నిర్మించుకున్నాయన్న ధర్మాసనం...పోరాడి సాధించుకున్న నూతన రాష్ట్రం కొత్త అసెంబ్లీని ఎందుకు నిర్మించుకోకూడదని ప్రశ్నించింది. వారసత్వ కట్టడాలు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వారసత్వ కట్టడాల జాబితాను మార్చే అధికారం హెచ్ఎండీఏకు ఉందా అని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం...విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి:'జల విద్యుత్ ఉత్పత్తి ఎంత పెరిగింది..?'