ETV Bharat / state

'ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదు.. అందుకే..'

author img

By

Published : Dec 29, 2022, 6:52 AM IST

Updated : Dec 29, 2022, 7:05 AM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారానికి సంబంధించిన వీడియోలు సీఎంకు ఎలా చేరాయో మిస్టరీగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి స్వయంగా వీడియోలను బహిర్గతపరచడంతో పాటు నిందితులను కుట్రదారులుగా ముద్ర వేశారని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. దర్యాప్తు అధికారుల లోపాలను కప్పిపుచ్చడానికే సిట్ వేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. సిట్ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేస్తోందనిపించడం లేదని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించనప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సీబీఐకి అప్పగించడానికి కారణాలను 98 పేజీల తీర్పులో వివరించింది.

హైకోర్టు
హైకోర్టు
'ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదు.. అందుకే..'

ఎమ్మెల్యేలకు ఎర అంశంపై సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతుందనే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టే సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ జస్టిస్ బీ.విజయసేన్ రెడ్డి ఇటీవల ఇచ్చిన 98 పేజీల తీర్పులో కారణాలను వివరించింది. ఎమ్మెల్యేలకు ఎర వివాదం తీవ్రమైనదేనని పేర్కొంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అర్థం చేసుకోదగినదేనని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీఎం అనడం అసాధారణ విషయమేమీ కాదని అభిప్రాయపడింది. ప్రధాని, హోంమంత్రి పేర్లను సీఎం ప్రస్తావించారన్న కారణంగా సీబీఐకి ఇవ్వాలన్న వాదన సమంజసం కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే వీడియో సీడీలు బహిర్గతం కావడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీడీలను ముఖ్యమంత్రి దేశంలోని న్యాయమూర్తులందరికీ పంపించడం తీవ్రంగా పరిగణించదగిన అంశమేనని తీర్పులో ప్రస్తావించింది.

రోహిత్​రెడ్డి ఇచ్చి ఉండొచ్చు: సీడీలు సీఎంకు ఎలా? ఎప్పుడు? ఎక్కడ చేరాయో మిస్టరీగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వివరణ ఇవ్వలేదని, దర్యాప్తు అధికారే సీఎంకు ఇచ్చారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చలేదని తీర్పులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్​రెడ్డి ఇచ్చి ఉండొచ్చునని అదనపు ఏజీ పేర్కొన్నప్పటికీ, కచ్చితంగా చెప్పలేదని హైకోర్టు పేర్కొంది. కేసుకు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంట్లు ఫిర్యాదుదారుడికి ఎలా అందుబాటులో ఉంటాయో కూడా వివరించలేదని తెలిపింది.

వీడియో రికార్డింగ్‌లు దర్యాప్తులో అత్యంత కీలకమనడంలో సందేహం లేదని న్యాయస్థానం పేర్కొంది. స్వయంగా ముఖ్యమంత్రి సీడీలను బహిర్గతం చేయడంతో పాటు నిందితులపై కుట్రదారులుగా ముద్ర వేశారని హైకోర్టు పేర్కొంది. నేరం రుజువయ్యే వరకు నిందితులను నిరపరాధులుగా పరిగణించాలన్న సూత్రానికి ఇది విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవలో నిందితుల రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులను విస్మరించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

దర్యాప్తు అధికారుల లోపాలను కప్పిపుచ్చేందుకే సిట్ వేసినట్లు ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సిట్ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేస్తుందని అనిపించడం లేదని కోర్టు పేర్కొంది. కేసు నమోదు నుంచి సీఎం మీడియా సమావేశం వరకు జరిగిన ఘటనలు నిందితుల ఆందోళన, అనుమానాలకు కారణమవుతున్నాయని తీర్పులో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారిని మార్చే అధికారం సాధారణ పరిస్థితుల్లో కోర్టులకు ఉండదని, అదేవిధంగా నిందితులు కోరలేరని పేర్కొంది. అయితే పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించనప్పుడు ప్రాథమిక దశలోనైనా కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

'ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదు.. అందుకే..'

ఎమ్మెల్యేలకు ఎర అంశంపై సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతుందనే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టే సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ జస్టిస్ బీ.విజయసేన్ రెడ్డి ఇటీవల ఇచ్చిన 98 పేజీల తీర్పులో కారణాలను వివరించింది. ఎమ్మెల్యేలకు ఎర వివాదం తీవ్రమైనదేనని పేర్కొంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అర్థం చేసుకోదగినదేనని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీఎం అనడం అసాధారణ విషయమేమీ కాదని అభిప్రాయపడింది. ప్రధాని, హోంమంత్రి పేర్లను సీఎం ప్రస్తావించారన్న కారణంగా సీబీఐకి ఇవ్వాలన్న వాదన సమంజసం కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే వీడియో సీడీలు బహిర్గతం కావడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీడీలను ముఖ్యమంత్రి దేశంలోని న్యాయమూర్తులందరికీ పంపించడం తీవ్రంగా పరిగణించదగిన అంశమేనని తీర్పులో ప్రస్తావించింది.

రోహిత్​రెడ్డి ఇచ్చి ఉండొచ్చు: సీడీలు సీఎంకు ఎలా? ఎప్పుడు? ఎక్కడ చేరాయో మిస్టరీగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వివరణ ఇవ్వలేదని, దర్యాప్తు అధికారే సీఎంకు ఇచ్చారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చలేదని తీర్పులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్​రెడ్డి ఇచ్చి ఉండొచ్చునని అదనపు ఏజీ పేర్కొన్నప్పటికీ, కచ్చితంగా చెప్పలేదని హైకోర్టు పేర్కొంది. కేసుకు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంట్లు ఫిర్యాదుదారుడికి ఎలా అందుబాటులో ఉంటాయో కూడా వివరించలేదని తెలిపింది.

వీడియో రికార్డింగ్‌లు దర్యాప్తులో అత్యంత కీలకమనడంలో సందేహం లేదని న్యాయస్థానం పేర్కొంది. స్వయంగా ముఖ్యమంత్రి సీడీలను బహిర్గతం చేయడంతో పాటు నిందితులపై కుట్రదారులుగా ముద్ర వేశారని హైకోర్టు పేర్కొంది. నేరం రుజువయ్యే వరకు నిందితులను నిరపరాధులుగా పరిగణించాలన్న సూత్రానికి ఇది విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవలో నిందితుల రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులను విస్మరించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

దర్యాప్తు అధికారుల లోపాలను కప్పిపుచ్చేందుకే సిట్ వేసినట్లు ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సిట్ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేస్తుందని అనిపించడం లేదని కోర్టు పేర్కొంది. కేసు నమోదు నుంచి సీఎం మీడియా సమావేశం వరకు జరిగిన ఘటనలు నిందితుల ఆందోళన, అనుమానాలకు కారణమవుతున్నాయని తీర్పులో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారిని మార్చే అధికారం సాధారణ పరిస్థితుల్లో కోర్టులకు ఉండదని, అదేవిధంగా నిందితులు కోరలేరని పేర్కొంది. అయితే పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించనప్పుడు ప్రాథమిక దశలోనైనా కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 29, 2022, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.