హైదరాబాద్లోని హబ్సిగూడలో ప్రముఖ సినీ కథానాయక తమన్నా సందడి చేసింది. ఓ సంస్థకు చెందిన 9వ బంగారం షోరూంను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అషేర్, రీజినల్ హెడ్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తమన్నాను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. షోరూం వెలువల తమన్నా వారందరిని పలకరించింది. ఈ కార్యక్రమంతో హబ్సిగుడ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి: అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా వంటేరు