హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్ కిటకిటలాడింది. ఆదివారం కావడం వల్ల కూరగాయలు, ఇతర వంట సరుకుల కొనుగోలు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్కు తరలివచ్చారు. సమీప ప్రాంత ప్రజలంతా ఉదయం 6 గంటల నుంచే మాదన్నపేట మార్కెట్ బాటపట్టారు.
మాస్కులు ధరించినప్పటికీ భౌతిక దూరం పాటించకుండానే గుమిగూడారు. కొనుగోలుదారులతో కూరగాయల మార్కెట్ కిక్కిరిసిపోయింది. సరూర్ నగర్ పోలీసులు కర్మన్ ఘట్లో చెక్ పోస్ట్ పెట్టి తనిఖీలు నిర్వహించారు.