రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలో అల్పపీడనంతోపాటు దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తమిళనాడు ఉత్తర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు 104 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదీచూడండి: గోదావరి నీటిలోకి.. నిండు ప్రాణాలు