ETV Bharat / state

మద్యం షాపుల వద్ద మందుబాబుల బారులు - telangana latest news

ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించడంతో మెదక్​ జిల్లాలో పలు మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. ఈ తరుణంలో ఇలా బారులు తీరడం వల్ల కరోనా ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

heavy crowd
heavy crowd
author img

By

Published : May 11, 2021, 8:22 PM IST

కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కరోనాను కట్టడి చేయాలనే నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో రేపటి నుంచి లాక్​డౌన్​ను విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాల సముదాయాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మెదక్​ జిల్లాలో పలు మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు.

ఈ తరుణంలో ఇలా బారులు తీరడం వల్ల కరోనా ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఎక్సైజ్ అధికారులు, వైన్స్ షాప్స్ వద్ద బారులు తీరిన వారిని కరోనా నిబంధనలు పాటించాలని చెప్పాల్సింది పోయి అక్కడే ఉండి చోద్యం చూడడం విశేషం.

కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కరోనాను కట్టడి చేయాలనే నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో రేపటి నుంచి లాక్​డౌన్​ను విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాల సముదాయాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మెదక్​ జిల్లాలో పలు మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు.

ఈ తరుణంలో ఇలా బారులు తీరడం వల్ల కరోనా ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఎక్సైజ్ అధికారులు, వైన్స్ షాప్స్ వద్ద బారులు తీరిన వారిని కరోనా నిబంధనలు పాటించాలని చెప్పాల్సింది పోయి అక్కడే ఉండి చోద్యం చూడడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.