గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడి వివిధ పాఠశాలల్లో తెలుగు మాధ్యమ సబ్జెక్టులను బోధిస్తున్న అధ్యాపకులు, తెలుగు భగవద్గీత లాంటి అంశాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు 75 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలు పూర్తిగా వర్చువల్ విధానంలో జరిగాయి.
ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా వెంకప్ప భాగవతుల వ్యవహరించగా.. సాంకేతిక సహకారాన్ని విక్రమ్ సుఖవాసి అందించారు. వివిధ దేశాల్లోని ఉపాధ్యాయులను సభకు పరిచయం చేసే కార్యక్రమాన్ని కువైట్ నుంచి సుధాకర్ రావు, ఖతార్ నుంచి శ్రీ సుధ, శిరీష, బెహరైన్ నుంచి జగదీశ్, పుజైరియా నుంచి మంజుల, అబుధాబి నుంచి విజయప్రసాద్, ఒమన్ నుంచి చైతన్య సూరపనేని, అరుంధతి, శ్రీదేవి నిర్వహించారు. గల్ఫ్ దేశాల్లోని ఉపాధ్యాయులు ప్రసంగించి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరినీ అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ప్రతి మనిషి జీవితంలో అమ్మ తర్వాత మొదటి గురువు.. ఉపాధ్యాయుడే. గురువు సూచనలను పాటించేవాడే అసలైన శిష్యుడు. జాతిపిత గాంధీ సైతం సర్వేపల్లి రాధాకృష్ణన్తో తనకున్న అనుబంధాన్ని కృష్ణార్జునలతో పోల్చారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ఎందరో ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చేందుకు పాటుపడ్డారు. -కార్యక్రమంలో ఉపాధ్యాయుల ప్రసంగం
మొట్టమొదటిసారిగా గల్ఫ్ దేశాల్లోని ఉపాధ్యాయులను.. తెలుగు సంఘాలన్నీ కలిసి సన్మానించుకోవటం ఆనందంగా ఉందని సుధాకర్ రావు అన్నారు. తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, వృత్తిలో అన్నివిధాల సలహాలు, సూచనలు ఇచ్చిన పై అధికారులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: Jeevan Reddy: గాంధీభవన్ను గాసిప్స్కు అడ్డాగా మార్చారు: జీవన్ రెడ్డి