ETV Bharat / state

ఆ జిల్లాల్లోని ఆదివాసీలకు పోషకాహార పంపిణీ: గవర్నర్​

author img

By

Published : Mar 27, 2021, 7:30 PM IST

ఆదివాసీల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు గవర్నర్​ తమిళిసై సౌందర్​రాజన్​ వినూత్న కార్యక్రమం చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, నాగర్​కర్నూల్​, ఆదిలాబాద్​ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో త్వరలో పోషకాహార పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కార్యాచరణ రూపకల్పనకు సంబంధిత అధికారులతో రాజ్​భవన్​లో సమావేశమయ్యారు.

nutrition food for tribals, nutrition food for tribals
గవర్నర్​ తమిళిసై సౌందర్​రాజన్​

మూరుమాల ప్రాంతాల గిరిజనుల కోసం పోషకాహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రకటించారు. రాజ్ భవన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గిరిజన ఆవాసాల్లో పోషకార పంపిణీ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్ణీత వ్యవధిలో అమలయ్యేలా కార్యాచరణ రూపొందించాలని నేషనల్ న్యూట్రిషన్ ఇనిస్టిట్యూట్, రెడ్​క్రాస్ సొసైటీలను ఆదేశించారు.

రాజ్ భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, రెడ్​క్రాస్ ప్రతినిధి మదన్మోహన్, ఈఎస్ఐ ఆస్పత్రి డీన్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఆదిమ తెగలకు చెందిన గిరిజనుల్లో సూక్ష్మపోషకాల లోపం తలెత్తుతోందని గవర్నర్​ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా గిరిజనుల్లో పోషకాహార విలువలు పెంచేందుకు ఈ కార్యక్రమం దిక్సూచి అవుతుందని గవర్నర్​ వెల్లడించారు. గిరిజన, విద్య, వైద్య శాఖల సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాదించవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. కొల్లం, కొండి రెడ్డి, చెంచుల వంటి గిరిజన తెగల్లో ముందుగా పంపిణీ చేపట్టనున్నట్టు వివరించారు.

ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్

మూరుమాల ప్రాంతాల గిరిజనుల కోసం పోషకాహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రకటించారు. రాజ్ భవన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గిరిజన ఆవాసాల్లో పోషకార పంపిణీ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్ణీత వ్యవధిలో అమలయ్యేలా కార్యాచరణ రూపొందించాలని నేషనల్ న్యూట్రిషన్ ఇనిస్టిట్యూట్, రెడ్​క్రాస్ సొసైటీలను ఆదేశించారు.

రాజ్ భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, రెడ్​క్రాస్ ప్రతినిధి మదన్మోహన్, ఈఎస్ఐ ఆస్పత్రి డీన్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఆదిమ తెగలకు చెందిన గిరిజనుల్లో సూక్ష్మపోషకాల లోపం తలెత్తుతోందని గవర్నర్​ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా గిరిజనుల్లో పోషకాహార విలువలు పెంచేందుకు ఈ కార్యక్రమం దిక్సూచి అవుతుందని గవర్నర్​ వెల్లడించారు. గిరిజన, విద్య, వైద్య శాఖల సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాదించవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. కొల్లం, కొండి రెడ్డి, చెంచుల వంటి గిరిజన తెగల్లో ముందుగా పంపిణీ చేపట్టనున్నట్టు వివరించారు.

ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.