ETV Bharat / state

'విద్యను మాతృభాషలో ఇస్తే.. అవగాహన శక్తి పెరుగుతుంది'

author img

By

Published : Oct 9, 2020, 7:49 PM IST

నూతన విద్యావిధానమనేది విద్యార్థులను జాబ్​ సీకర్స్​లా కాకుండా... జాబ్​ క్రియేటర్లుగా తీర్చిదిద్దుతుందని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. సెంటర్​ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ నిర్వహించిన వెబినార్​లో ఆమె పాల్గొన్నారు.

governor-tamilisai-soundararajan-webinar-on-national-education-policy-2020-at-raj bhavan
'విద్యను మాతృభాషలో ఇస్తే.. అవగాహన శక్తి పెరుగుతుంది'

జాతీయ నూతన విద్యావిధానం-2020... విద్యలో నాణ్యతను పెంచి.. గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్​గా భారత్​ను నిలుపుతుందని గవర్నర్ తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజ్​భవన్​లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ నిర్వహించిన వెబినార్​లో గవర్నర్ పాల్గొన్నారు.

ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీ... విద్యార్థులను జాబ్ సీకర్స్​లా కాకుండా.. జాబ్ క్రియేటర్లుగా ఎదిగేలా చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో ఇవ్వటం వల్ల.. విషయం పట్ల విద్యార్థుల్లో మెరుగైన అవగాహన వస్తుందని గవర్నర్ అన్నారు. జపాన్, జర్మనీ, కొరియా వంటి దేశాల్లోని పౌరులకు.. మాతృభాషలో బోధనే వారిని టెక్నాలజీ లీడర్స్​లా ఎదిగేలా చేసిందని గుర్తు చేశారు.

భారతీయ విద్యాసంస్థల్లో ప్రపంచ స్థాయి విద్య దొరికేలా చూడాలని.. కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన విద్యావిధానంపై విస్తృత అవగాహనకు పాటుపడుతూ, సందేహాల నివృత్తికి అకడమిక్ నిపుణులు పాటుపడాలని సూచించారు. దేశంలోని ప్రతిజిల్లాలో భిన్న కోర్సులను ఆఫర్ చేసే పరిశోధనాత్మక విశ్వవిద్యాలయం తీసుకురావాలనేదే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని తమిళిసై పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఏపీ పాలిసెట్-2020 ఫలితాలు విడుదల

జాతీయ నూతన విద్యావిధానం-2020... విద్యలో నాణ్యతను పెంచి.. గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్​గా భారత్​ను నిలుపుతుందని గవర్నర్ తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజ్​భవన్​లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ నిర్వహించిన వెబినార్​లో గవర్నర్ పాల్గొన్నారు.

ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీ... విద్యార్థులను జాబ్ సీకర్స్​లా కాకుండా.. జాబ్ క్రియేటర్లుగా ఎదిగేలా చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో ఇవ్వటం వల్ల.. విషయం పట్ల విద్యార్థుల్లో మెరుగైన అవగాహన వస్తుందని గవర్నర్ అన్నారు. జపాన్, జర్మనీ, కొరియా వంటి దేశాల్లోని పౌరులకు.. మాతృభాషలో బోధనే వారిని టెక్నాలజీ లీడర్స్​లా ఎదిగేలా చేసిందని గుర్తు చేశారు.

భారతీయ విద్యాసంస్థల్లో ప్రపంచ స్థాయి విద్య దొరికేలా చూడాలని.. కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన విద్యావిధానంపై విస్తృత అవగాహనకు పాటుపడుతూ, సందేహాల నివృత్తికి అకడమిక్ నిపుణులు పాటుపడాలని సూచించారు. దేశంలోని ప్రతిజిల్లాలో భిన్న కోర్సులను ఆఫర్ చేసే పరిశోధనాత్మక విశ్వవిద్యాలయం తీసుకురావాలనేదే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని తమిళిసై పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఏపీ పాలిసెట్-2020 ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.