పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ప్రకటించింది. కొంకలపల్లికి చెందిన 269 కుటుంబాలు, 52 మంది మేజర్లకు పరిహారం ఇవ్వనుంది. బండరావిపాకులలో 729 కుటుంబాలు, 249 మంది మేజర్లకు పరిహారం అందించనుంది. ఇందుకోసం రూ.140.19 కోట్లు పరిహారం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతగిరికి నిర్వాసితులకు...
కాళేశ్వరం ప్రాజెక్ట్ పదో ప్యాకేజీలో నిర్వాసిత కుటుంబాలకు కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అనంతగిరికి చెందిన మరో 42 నిర్వాసితులకు కలిపి మొత్తం 1,177 కుటుంబాలకు రూ.3.16 కోట్ల నిధులు విడుదల చేస్తూ నీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి