ETV Bharat / state

పేయింటింగ్​ చూస్తూ ఉత్కంఠకు గురయ్యాను: గవర్నర్​ - కశ్మీర్​ ఆన్​ క్యాన్వాస్​ ఆర్ట్​ ఎగ్జిబిషన్​

మాదాపూర్​ స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీలోని కశ్మీర్​ ఆన్​ క్యాన్వాస్​ ఆర్ట్​ ఎగ్జిబిషన్​ ముగింపు వేడుకల్లో సౌందర రాజన్ పాల్గొన్నారు. ​చిత్రాలను అమ్మగా 12  లక్షలు రాగా.. అందులో 6 లక్షలు తెలంగాణ పోలీసులకు మరో 6 లక్షలు జమ్ము కశ్మీర్ పోలీసులకు గవర్నర్  చేతుల మీదుగా అందజేశారు.

governor
governor
author img

By

Published : Dec 17, 2019, 11:44 PM IST

దక్షిణ భారతం అందాలు పేయింటింగ్​లో చూస్తూ ఉత్కంఠకు గురయ్యాయని గవర్నర్​ తమిళిసై తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్​లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన కశ్మీర్ ఆన్ క్యాన్వాస్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ముగింపు వేడుకలకు గవర్నర్​, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జమ్ము కశ్మీర్ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

చిత్రకారిణి శిరీష శ్రీనివాస్ రూపొందించిన చిత్రాలను గత నాలుగు రోజులుగా ప్రదర్శిస్తున్నారు. శిరీష శ్రీనివాస్.. క్యాన్వాస్ జాలువారిన చిత్రాలను అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అందించాలన్న లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్​ను ఏర్పాటు చేశారు.

చిత్రాలను అమ్మగా 12 లక్షలు రాగా.. అందులో 6 లక్షలు తెలంగాణ పోలీసులకు మరో 6 లక్షలు జమ్ము కశ్మీర్​ పోలీసులకు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్​లు మరెన్నో నిర్వహించి పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తమిళిసై పేర్కొన్నారు.

పేయింటింగ్​ చూస్తూ చాలా ఉత్కంఠకు గురయ్యాను: గవర్నర్​

ఇవీ చూడండి: ఆలయంలో తైలవర్ణ చిత్రాలు వేయించండి: సీఎం కేసీఆర్​

దక్షిణ భారతం అందాలు పేయింటింగ్​లో చూస్తూ ఉత్కంఠకు గురయ్యాయని గవర్నర్​ తమిళిసై తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్​లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన కశ్మీర్ ఆన్ క్యాన్వాస్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ముగింపు వేడుకలకు గవర్నర్​, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జమ్ము కశ్మీర్ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

చిత్రకారిణి శిరీష శ్రీనివాస్ రూపొందించిన చిత్రాలను గత నాలుగు రోజులుగా ప్రదర్శిస్తున్నారు. శిరీష శ్రీనివాస్.. క్యాన్వాస్ జాలువారిన చిత్రాలను అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అందించాలన్న లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్​ను ఏర్పాటు చేశారు.

చిత్రాలను అమ్మగా 12 లక్షలు రాగా.. అందులో 6 లక్షలు తెలంగాణ పోలీసులకు మరో 6 లక్షలు జమ్ము కశ్మీర్​ పోలీసులకు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్​లు మరెన్నో నిర్వహించి పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తమిళిసై పేర్కొన్నారు.

పేయింటింగ్​ చూస్తూ చాలా ఉత్కంఠకు గురయ్యాను: గవర్నర్​

ఇవీ చూడండి: ఆలయంలో తైలవర్ణ చిత్రాలు వేయించండి: సీఎం కేసీఆర్​

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.