ETV Bharat / state

నయా మోసం.. లింక్​ యాక్సెప్ట్ చేస్తే మొబైల్ రీఛార్జ్

author img

By

Published : Apr 29, 2020, 4:34 PM IST

ఓ వ్యక్తి గూగుల్​ పే ద్వారా తన మొబైల్​కు రీఛార్జ్ చేయడానికి యత్నించగా.. అది కాలేదు. గూగుల్​లో కస్టమర్​ కేర్​ కోసం వెతకగా ఒక నెంబర్​ దొరికింది. సదురు నంబర్​ కాల్​ చేసి తన సమస్య చెప్పాడు. వాళ్లు చెప్పినట్టు చేసి మోసిపోయాడు.

google-pay-cheating-in-hyderabad
నయా మోసం.. లింక్​ యాక్సెప్ట్ చేస్తే మొబైల్ రీఛార్జ్

లాక్​డౌన్​లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి గూగుల్ పే ద్వారా తన ఫోన్​కి రీఛార్జ్ చేశాడు. రీఛార్జ్ కాకపోవడం వల్ల కస్టమర్ కేర్ కోసం గూగుల్​లో సెర్చ్ చేశాడు. కస్టమర్ కేర్ నంబర్​కి కాల్ చేసి తన సమస్య చెప్పాడు. అంతే.. అదే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు... తక్షణం ఫోన్ రీఛార్జ్ కావాలంటే తాము పంపించిన లింక్​ను యాక్సెప్ట్ చేయాలని కేటుగాళ్లు సూచించారు. బాధితుడు లింక్​ యాక్సెప్ట్ చేయగానే.. యూపీఐ నంబర్ ద్వారా రూ. 64,000ను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లాక్​డౌన్​లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి గూగుల్ పే ద్వారా తన ఫోన్​కి రీఛార్జ్ చేశాడు. రీఛార్జ్ కాకపోవడం వల్ల కస్టమర్ కేర్ కోసం గూగుల్​లో సెర్చ్ చేశాడు. కస్టమర్ కేర్ నంబర్​కి కాల్ చేసి తన సమస్య చెప్పాడు. అంతే.. అదే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు... తక్షణం ఫోన్ రీఛార్జ్ కావాలంటే తాము పంపించిన లింక్​ను యాక్సెప్ట్ చేయాలని కేటుగాళ్లు సూచించారు. బాధితుడు లింక్​ యాక్సెప్ట్ చేయగానే.. యూపీఐ నంబర్ ద్వారా రూ. 64,000ను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా.. 1009కి చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.