ETV Bharat / state

చిత్తూరు జిల్లా హథీరాంజీ మఠంలో భారీగా నగలు మాయం

author img

By

Published : Jul 10, 2020, 7:21 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా హథీరాంజీ మఠంలో నగల మాయం వ్యవహారం కలకలం రేపుతోంది. మఠం పరిధిలోనున్న తిరుమలలోని జాపాలి ఆంజనేయస్వామి ఆలయంలో 110 గ్రాముల బంగారు డాలరు మాయమైనట్లు నిర్వహకులు గుర్తించారు. ఈ నగపై పోలీసులకు మఠం నిర్వహకులు ఫిర్యాదు చేయలేదు.

hathiram matham - gold miss
హథీరాంజీమఠంలో నగలు మాయం... పోలీసులకు ఫిర్యాదు చేయని మహంతు!

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా హథీరాంజీ మఠంలో నగలు మాయమయ్యాయి. మఠం పరిధిలోనున్న తిరుమలలోని జాపాలి ఆంజనేయస్వామి ఆలయంలో దాదాపు 110 గ్రాముల బంగారు డాలరు మాయమైనట్లు నిర్వాహకులు గుర్తించారు. హథీరాంజీ మఠంలో అకౌంటెంట్​గా విధులు నిర్వహించే గుర్రప్ప.. అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని అకౌంటెంట్​గా నియమిస్తూ... మఠం బాధ్యతలను అప్పగించింది. మఠం పరిధిలో ఉన్న ఆలయాలకు సంబంధించి ఆభరణాల వివరాలను మఠ నిర్వహకులు తెలుసుకున్నారు. ఈ సమయంలో నగలు మాయమైన సంఘటన వెలుగు చూసింది. డాలర్ మాయమైనట్లు...రిజిస్టర్​లో తేలింది.

ఆ డాలరును జాపాలి ఆలయ పూజారికి ఇచ్చినట్లు గుర్రప్ప తన రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. గుర్రప్ప రికార్డుల్లో ఉన్న మేరకు జాపాలి ఆలయ పూజారిని విచారించినపుడు తనకు ఇవ్వలేదని తెలిపాడు. దీంతో నగల మాయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మఠం మహంతు అర్జున్ దాస్ అంతర్గతంగా నగల మాయంపై విచారణ నిర్వహిస్తున్నారు. అధికారికంగా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా హథీరాంజీ మఠంలో నగలు మాయమయ్యాయి. మఠం పరిధిలోనున్న తిరుమలలోని జాపాలి ఆంజనేయస్వామి ఆలయంలో దాదాపు 110 గ్రాముల బంగారు డాలరు మాయమైనట్లు నిర్వాహకులు గుర్తించారు. హథీరాంజీ మఠంలో అకౌంటెంట్​గా విధులు నిర్వహించే గుర్రప్ప.. అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని అకౌంటెంట్​గా నియమిస్తూ... మఠం బాధ్యతలను అప్పగించింది. మఠం పరిధిలో ఉన్న ఆలయాలకు సంబంధించి ఆభరణాల వివరాలను మఠ నిర్వహకులు తెలుసుకున్నారు. ఈ సమయంలో నగలు మాయమైన సంఘటన వెలుగు చూసింది. డాలర్ మాయమైనట్లు...రిజిస్టర్​లో తేలింది.

ఆ డాలరును జాపాలి ఆలయ పూజారికి ఇచ్చినట్లు గుర్రప్ప తన రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. గుర్రప్ప రికార్డుల్లో ఉన్న మేరకు జాపాలి ఆలయ పూజారిని విచారించినపుడు తనకు ఇవ్వలేదని తెలిపాడు. దీంతో నగల మాయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మఠం మహంతు అర్జున్ దాస్ అంతర్గతంగా నగల మాయంపై విచారణ నిర్వహిస్తున్నారు. అధికారికంగా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.