కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు అగ్నిమాపక యంత్రాలతో రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. చందానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని ఫుట్పాత్లు దుకాణాలు, ఇళ్ల ముందు పిచికారి చేశారు.
క్వారంటైన్లో ఉన్న వారి ప్రాంతాల్లో... అనుమానాస్పద ఏరియాల్లో నిరంతరం సోడియం హైపో క్లోరైట్ను స్ప్రే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగాల ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నామన్నారు.